పోలీసుల అదుపులో జ్యూయలరీస్‌ షాపు యజమాని | - | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో జ్యూయలరీస్‌ షాపు యజమాని

May 8 2025 9:19 AM | Updated on May 8 2025 9:19 AM

పోలీస

పోలీసుల అదుపులో జ్యూయలరీస్‌ షాపు యజమాని

విజయనగరం క్రైమ్‌: స్థానిక గంటస్తంభం వద్ద ఎన్‌వీఆర్‌ జ్యూయలరీ షాపును రన్‌ చేస్తున్న యజమానికి వన్‌టౌన్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ఆ షాపు యజమాని నాగుల కొండ వెంకట కిశోర్‌పై రెండు ఎన్‌బీబ్ల్యూ కేసులతో పాటు ఒక ఎన్‌ఐఏ కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. నిందితుడు గతంలో ఒక మహిళను వేధించాడని అప్పుడే కేసు నమోదైందన్నారు. అలాగే ఒక చెక్‌బౌన్స్‌ కేసులో కూడా నిందితుడని చెప్పారు. షాపుకు వచ్చిన కొనుగోలుదారులకు నకిలీ బంగారం ఆశ చూపి డబ్బులు కాజేసేవాడన్న ఫిర్యాదులు కూడా వచ్చాయని సీఐ చెప్పారు. ఈ మేరకు షాపు యజమాని కిశోర్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్‌ విధించినట్లు చెప్పారు.

ప్రతిభకు పురస్కారం

పార్వతీపురం: సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సంక్షేమ వసతి గృహాల్లో పదోతరగతి, ఇంటర్‌మీడియట్‌ పరీక్షలలో అత్యున్నత ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ మేరకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజేయస్వామి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిలు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పార్వతీపురం సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహంలో 600 మార్కులకుగాను 558 మార్కులు సాధించిన జి.అనితను సన్మానించి ఘనంగా సత్కరించారు. దీనిపై సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి మహమ్మద్‌ గయాజుద్దీన్‌ హర్షం వ్యక్తం చేశారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

తెర్లాం: తెర్లాం జంక్షన్‌లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు బుధవారం తెర్లాం ఎస్సై సాగర్‌బాబు మాట్లాడుతూ మృతి చెందిన వ్యక్తి ఆచూకీ తెలియరాలేదన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బాడంగి సీహెచ్‌సీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని తెలిపారు. మాసిపోయిన గడ్డం, గళ్ల లుంగీ కట్టుకుని ఉన్నాడని, సుమారు 65 నుంచి 70ఏళ్ల వయస్సు ఉంటుందని తెలియజేశారు. ఫొటోలో చూసి ఎవరైనా గుర్తుపడితే బాడంగి సీహెచ్‌సీకి వచ్చి వివరాలు తెలియజేయాలని కోరారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.

కిలో గంజాయితో ఇద్దరి అరెస్టు

రాజాం సిటీ: మండల పరిధి శ్యాంపురం రోడ్డులో కిలో గంజాయితో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని సీఐ ఉపేంద్రరావు తెలిపారు. బుధవారం శ్యాంపురం రోడ్డులోని అగ్రహారం జంక్షన్‌ వద్ద ఎస్సై వై.రవికిరణ్‌కు వచ్చిన సమాచారం మేరకు వాహన తనిఖీలు చేపట్టారు. స్కూటీపై వెళ్తున్న కొఠారిపురం గ్రామానికి చెందిన పంచిరెడ్డి వెంకటరమణ, డోలపేటకు చెందిన పూతిక హరిశంకర్‌లను తనిఖీ చేయగా వారి స్కూటీలో గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించామని రూరల్‌ సీఐ ఉపేంద్రరావు తెలిపారు.

కుక్కకాటుతో లేగదూడ

మృతి

పాలకొండ రూరల్‌: మండలంలోని రుద్రిపేటలో కుక్కకాటు కారణంగా లేగదూడ మరణించిందని రైతు ప్రసాదరావు బుధవారం తెలిపాడు. కొద్దిరోజుల క్రితం కుక్కకాటుకు గురైన దూడను వెలగవాడ పశువుల ఆస్పత్రికి తీసుకువెళ్లగా రేబిస్‌ వ్యాక్సిన్‌ లేదని వైద్యులు పేర్కొన్నట్లు రైతు వాపోయాడు. రూ.1200 వెచ్చించి బహిరంగ మార్కెట్‌లో వ్యాక్సిన్‌ కొనుగోలు చేయాల్సివచ్చిందని, అయినప్పటికీ దూడ మరణించిందన్నాడు. పశువైద్య కేంద్రాల్లో రేబిస్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉంచడంతో పాటు కుక్కలను నియంత్రించాలని కోరాడు.

పోలీసుల అదుపులో జ్యూయలరీస్‌ షాపు యజమాని1
1/3

పోలీసుల అదుపులో జ్యూయలరీస్‌ షాపు యజమాని

పోలీసుల అదుపులో జ్యూయలరీస్‌ షాపు యజమాని2
2/3

పోలీసుల అదుపులో జ్యూయలరీస్‌ షాపు యజమాని

పోలీసుల అదుపులో జ్యూయలరీస్‌ షాపు యజమాని3
3/3

పోలీసుల అదుపులో జ్యూయలరీస్‌ షాపు యజమాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement