
బుధవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2025
–8లో
డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన..
గ్రామీణ ప్రజలకు వైద్యసేవలు అందించడంలో సీహెచ్వోలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత నెల 28వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు. మా డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం చేస్తాం.
– సీహెచ్ జగదీష్కుమార్, సీహెచ్వో,
బాలగుడబ, పార్వతీపురం మండలం
బకాయిలు విడుదల చేయాలి
ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని అడుగుతున్నాం. ప్రతి నెలా జీతంతో పాటు ఇన్సెంటివ్ అందజేయాలి. పెండింగ్ ఇన్సెంటివ్, ఇతర బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలి. అద్దెలు కూడా ఇవ్వకపోవడంతో మా సొంత డబ్బులు చెల్లిస్తున్నాం.
– ఎస్.పవిత్ర, సీహెచ్వో, చిట్టిపూడివలస, వీరఘట్టం మండలం
గత్యంతరం లేకనే...
జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలనే ప్రధానమైన డిమాండ్లతో సమ్మెకుదిగాం. తొలుత శాంతియుతంగానే నిరసన చేపట్టాం. ఫలితం లేకపోవడంతో
నిరవధిక సమ్మె చేపట్టాం.
– కె.కోటి, సీహెచ్వో, దోనుబాయి,
సీతంపేట మండలం
మా పట్ల నిర్లక్ష్యం ఎందుకు?
మారుమూల గ్రామ ప్రజలకు వైద్య సేవలందిస్తున్న మా పట్ల ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం ఎందుకు?. ప్రభుత్వపరంగా ఏ సర్వే చేపట్టాలన్నా సమయంతో సంబంధం లేకుండా పని చేస్తున్నాం. రోగులను గుర్తిస్తున్నాం. గ్రామాల్లో వైద్యసేవలుపరంగా కీలకంగా ఉంటున్నాం. ప్రభుత్వం మా సేవలను గుర్తించి, న్యాయం చేయాలి.
– జె.శాంతి, సీహెచ్వో, బందలుప్పి,
పార్వతీపురం మండలం
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్:
గ్రామీణ పేదల వైద్యం పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. సకాలంలో వైద్యసేవలందకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తోంది. వైద్య సిబ్బంది న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. గ్రామీణులకు వైద్యాన్ని చేరువ చేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు.. నేడు ఎండనక, వాననక హక్కుల సాధన కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. ఫలితం.. వీరు ప్రతిరోజూ అందించే వైద్యసేవలు మరుగన పడ్డాయి. పల్లె ముంగిటకు వైద్యం అందని పరిస్థితి నెలకొంది. వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
10 రోజులుగా సమ్మె బాట..
గత ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్ (సబ్సెంటర్లు)లలో 14 రకాల వైద్య సేవలతో పాటు 105 రకాల మందులు అందుబాటులో తెచ్చింది. స్థానికంగానే నాణ్యమైన వైద్యం అందించాలన్న సంకల్పంతో విలేజ్ హెల్త్ క్లినిక్లకు పురుడుపోసింది. ధనవంతులకే పరిమితమైన ఫ్యామిలీ డాక్టర్ సేవలను పల్లె ప్రజలకు చేరువచేసింది. హెల్త్ క్లినిక్లకు ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదలకు అందిస్తున్న వైద్య వ్యవస్థలను సర్వనాశనం చేసింది. ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే.. విజయనగరంలో 456 మంది, పార్వతీపురం మన్యంలో 280 మంది సీహెచ్ఓలుగా పని చేస్తున్నారు. ఎన్హెచ్ఎం పథకం కింద 2018లో వీరు కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకమయ్యారు. అందరూ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసినవారే. మొదట్లో వీరికి రూ.24,800 వేతనంతో పాటు.. ఇన్సెంటివ్ రూ.15 వేల వరకు వచ్చేది. పీఎఫ్ కూడా అమలయ్యేది. కూటమి ప్రభుత్వం వచ్చాక.. ఇన్సెంటివ్ను రూ.7,500కు పరిమితం చేశారు. ఇది ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో కూడా తెలియదు. పీఎఫ్ కూడా అమలు చేయడం మానేశారు. ఎన్హెచ్ఎంలో పని చేసే అన్ని విభాగాలకూ జీతం పెరిగినా.. వీరికి నేటికీ విధుల్లో తీసుకున్నప్పుడు ఇచ్చిన మొత్తమే అందుతోంది. సబ్ సెంటర్లలో వీరితోపాటు ఏఎన్ఎం, ఆశ, సీహెచ్డబ్ల్యూ ఉంటారు. చాలాచోట్ల కనీస వసతులు లేని గదుల్లోనే కేంద్రాలను నడుపుతున్నారు. భవనాల అద్దెకు కూడా ప్రభుత్వం కొంతకాలంగా నిధులు విడుదల చేయకపోవడంతో సీహెచ్వోలే తమ జేబుల్లో నుంచి తీసిస్తున్నారు. కేంద్రం నిర్వహణకు కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదు.
సీహెచ్వోల మానవహారం
పార్వతీపురంటౌన్: పంచాయతీ పరిధిలో ప్రజలకు ఆరోగ్యసేవలందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఆర్థిక, ఆర్థికేత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఆందోళన చేశారు. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో మానవహారం నిర్వహించారు. సీహెచ్వోలందరూ కాంట్రాక్టు ఉద్యోగులని, విధుల నుంచి తొలగిస్తామంటూ ఏపీ ఆరోగ్యశాఖమంత్రి సత్యకుమార్ యాదవ్ బెదిరింపులను ఖండించారు. వెంటనే వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని సీహెచ్వోల సంఘం జనరల్ సెక్రటరీ టి.ఇంద్రాణి హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు జగదీష్, సెక్రెటరీ కె.శిరీష, కోశాధికారి రాజేశ్వరి, జాకబ్ మెంబర్స్ యువకాంత్ యశ్వంత్, 250 మంది సీహెచ్వోలు పాల్గొన్నారు.
మానహారంగా ఏర్పడిన సీహెచ్వోలు
న్యూస్రీల్
వీరి డిమాండ్లు ఏంటంటే...
వీరికిస్తున్న వేతనం పెంచాలని అడుగుతున్నారు. పీఎఫ్ను పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఆరేళ్లు దాటి సర్వీసు ఉన్న వారి సేవలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు.
పెండింగ్ ఇన్సెంటివ్, అద్దెలు, బిల్లుల బకాయిలు చెల్లించాలి.
బదిలీలకు అవకాశం కల్పించాలి.
తమ జాబ్ చార్ట్ ఏమిటో స్పష్టం చేయాలన్న ప్రధాన డిమాండ్లతో గత నెల 28 నుంచి విధులను బహిష్కరించి, కలెక్టరేట్ వద్ద నిరసనలు చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
డిమాండ్ల సాధన కోసం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల నిరసన
గ్రామాల్లో స్తంభించిన వైద్యసేవలు
పట్టించుకోని ప్రభుత్వం
వైద్యసేవలపై ప్రభావం..
సీహెచ్వోలు సబ్ సెంటర్లలో ఓపీ చూస్తారు.
వైద్యసేవలపరంగా ప్రభుత్వం నుంచి ఏ సర్వే చేపట్టాలన్నా వీరే ముందుండాలి.
యాంటినేటల్ సర్వీసెస్ నిర్వహిస్తారు. గర్భిణులకు మూడో నెల నుంచి ప్రసవం అయ్యే వరకు.. ఆ తర్వాత కూడా నిరంతర పర్యవేక్షణ చేస్తారు. ఇటీవల కాలంలో మాతాశిశు మరణాలు తగ్గుముఖం పట్టాయంటే కారణం వీరు అందిస్తున్న సేవలే.
మంచాలకే పరిమితమైన రోగులకు ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యం అందిస్తారు. టీబీ, హెచ్ఐవీ రోగులకు కూడా సేవలందిస్తున్నారు.
ప్రతి నెలా వైద్యశిబిరాల నిర్వహణతోపాటు, 104 వాహనాలతోనూ వెళ్లి గ్రామీణులకు సేవలు.
టెలీ మెడిసన్ సర్వీసెస్ అందిస్తారు. ఫోన్లోనే రోగులకు ట్రీట్మెంట్కు సంబంధించిన సలహాలు, సూచనలు ఇస్తుంటారు.
అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల సందర్శన చేసి పిల్లలను పరీక్షిస్తారు. ఎత్తుకు తగ్గ బరువు, రక్తహీనత, ఇతర ఆరోగ్య రుగ్మతలను గుర్తించి, అవసరమైన వారికి మెడికల్ ఆఫీసరు వద్దకు రిఫర్ చేస్తారు.
గ్రామాల్లోని ఇంటింటికీ వెళ్లి వృద్ధులకు, రోగులకు టీబీ, మధుమేహం పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించి, అవసరమైన మందులు ఇవ్వడం
కేన్సర్ పేషెంట్లను, యుక్త వయస్సు గర్భిణులను గుర్తించడం, ఎన్సీడీ సర్వే, సికిల్సెల్ పరీక్షల నిర్వహణ
ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించడం, వారు వడదెబ్బ బారిన పడకుండా తగిన సలహాలు ఇవ్వడం
గ్రామాల్లో అపరిశుభ్ర వాతావరణం ఉంటే ఫొటోలు తీసి, సచివాలయ సిబ్బందికి పంపించడం ఇలా వివిధ రకాల సేవలందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలపరంగా సీహెచ్వోలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. పేరుకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకే విధులైనప్పటికీ.. సమయంలో సంబంధం లేకుండా ఒక్కోసారి 24 గంటలూ పని చేయాల్సి వస్తోంది. వీరి సమ్మెతో ప్రస్తుతం ఈ సేవలన్నీ నిలిచిపోయాయి.

బుధవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2025

బుధవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2025

బుధవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2025

బుధవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2025

బుధవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2025

బుధవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2025

బుధవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2025

బుధవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2025