మే 31 నాటికి బాలలందరికీ ఆధార్‌ కార్డులు | - | Sakshi
Sakshi News home page

మే 31 నాటికి బాలలందరికీ ఆధార్‌ కార్డులు

Apr 30 2025 5:11 AM | Updated on Apr 30 2025 5:11 AM

మే 31 నాటికి బాలలందరికీ ఆధార్‌ కార్డులు

మే 31 నాటికి బాలలందరికీ ఆధార్‌ కార్డులు

పార్వతీపురంటౌన్‌: ఆధార్‌ లేని బాలలందరికీ మే 31 నాటికి ఆధార్‌ కార్డులను మంజూరుచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ శోభిక మండల అధికారులు, ఐసీడిఎస్‌ అధికారులను ఆదేశించారు. జనన ధ్రువీకరణ పత్రాలు, పింఛన్లు, గృహాలు, నీటి పన్ను, రీసర్వే తదితర అంశాలపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల వ్యవసాయ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, సీడీపీఓలతో కలెక్టర్‌ కార్యాలయంలోని వీడియో సమావేశ మందిరం నుంచి మంగళవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 6 ఏళ్లలోపు వయసు గల బాలలు 3,743 మంది ఉన్నారని, వారికి జనన ధ్రువీకరణ పత్రాలు లేనందున ఆధార్‌ కార్డులు మంజూరుకాలేదన్నారు. వారందరికీ ముందుగా జనన ధ్రువీకరణ పత్రాలను జారీచేయాలని, ఇందుకోసం ఆధార్‌ కార్డులు లేని బాలల జాబితాలను ఆయా మండలాలకు పంపించామని స్పష్టం చేశారు. సమావేశంలో పాలకొండ సబ్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, కేఆర్‌ఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్‌ డా.పి.ధర్మచంద్రారెడ్డి, డ్వామా, డీఆర్డీఏ, ఐసీడీఎస్‌ పీడీలు కె.రామచంద్రరావు, ఎం.సుధారాణి, డా.టి.కనకదుర్గ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల వ్యవసాయ అధికారులు, మునిసిపల్‌ కమిషనర్లు, సీడీపీఓలు తదితరులు పాల్గొన్నారు.

జేసీ ఎస్‌ఎస్‌ శోభిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement