ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం

Mar 13 2025 12:38 AM | Updated on Mar 13 2025 12:37 AM

పార్వతీపురంటౌన్‌: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మాజీ ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా దివంగత వైఎస్సార్‌ విగ్ర హానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ జెండాను పరీక్షిత్‌రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వైఎస్సార్‌ తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌సీపీ 15వ వసంతంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందన్నారు. గత ఐదేళ్లు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సుభిక్షమైన పాలన అందించిందన్నారు. మళ్లీ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కొండపల్లి బాలకృష్ణ, బొమ్మి రమేష్‌, బొంగు చిట్టిరాజు, పి.మురళీకృష్ణ, బోను గౌరీశ్వరి, కొండపల్లి రుక్మిణి, బలగ రేవవతమ్మ, మామిడి బాబ్జీ, ఎ.రవికుమార్‌, మజ్జి శోభారాణి, బలగ రమణమ్మ, జి.నాగమణి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement