–8లో
కూటమి దగా పాలనపై
● విద్యార్థులు, యువత కోసం గొంతెత్తిన వైఎస్సార్సీపీ ● జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ ● పోలీసులను అడ్డం పెట్టుకుని అడుగడుగునా ఆంక్షలు విధించిన ప్రభుత్వం ● అడ్డంకులను తిప్పికొట్టిన వైఎస్సార్సీపీ నేతలు, నిరుద్యోగులు
కిడ్నీల పట్ల శ్రద్ధ చూపాలి
మానవ శరీరంలో కిడ్నీలు అతి ముఖ్యమైనవి. కిడ్నీ సమస్యలపై అశ్రద్ధ చేస్తే మృత్యువాతపడే ప్రమాదం ఉంది.
గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025
● యువతను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం
ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అప్పటివరకు నిరుద్యోగులకు నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి చెల్లి స్తామని కూటమి నేతలు హామీలిచ్చారు. యువత మద్దతుతో అధికారంలోకి వచ్చి నేడు వారినే మోసం చేస్తున్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యా ర్థులకు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాల తో చదువుకు అండగా నిలిచేది. నేడు ఫీజురీయింబర్స్ మెంట్ నిధుల కోసం పోరుబాట పట్టాల్సిన దుస్థితి నెలకుంది. – శత్రుచర్ల పరిక్షిత్ రాజు,
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం
● యువగళానికి మంగళం
ఎన్నకల ముందు నారాలోకేశ్ యువగళం పేరుతో యువతకు హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవ డం మానేశారు. నిరుద్యోగ భృతిని ఎగ్గొట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు హాల్టికెట్లు ఇవ్వని పరిస్థితి నెలకొంది. నిరుద్యోగులను 2014లో మోసం చేశారు. మళ్లీ ఇప్పుడు మోసం చేస్తున్నారు.
– పీడీక రాజన్నదొర, మాజీ డిప్యూటీ సీఎం
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం టౌన్:
కూటమి ప్రభుత్వ దగాకోరు పాలనపై యువతీయువకులు కదంతొక్కారు. విద్యార్థుల చదువులపై కూటమి అక్కసును ఎండగట్టారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఫీజురీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా చదువును దూరం చేస్తోందని మండిపడ్డారు. జాబ్క్యాలెండర్, నిరుద్యోగభృతి హామీలు విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నినదించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ మోసపూరిత విధానాలను ఖండిస్తూ.. నిరుద్యోగులు, యువత, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం ‘యువత పోరు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి వందలాదిగా తరలివచ్చిన ఆ పార్టీ నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు, తల్లిదండ్రులతో కలసి పార్వతీపురం పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. కాంప్లెక్స్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. విద్యార్థులకు ఫీజు బకాయిలను తక్షణం విడు దల చేయాలని, నిరుద్యోగ యువతకు ‘నిరుద్యోగ భృతి’ అందించాలని.. లేని యెడల 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని నినాదాలు చేశారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, అడ్డంకులు సృష్టించినా ప్రజ ల పక్షాన వైఎస్సార్సీపీ పోరుబాట ఆపేది లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, మాజీ డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి స్పష్టం చేశారు. నేటి ప్రభుత్వ నిర్వాకంవల్ల పిల్లలను చదివించుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా తల్లికి వందనం, వసతిదీవెన, విద్యాదీవెన నిధులేవీ విడుదల చేయలేదని తెలిపారు. పేద, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు గత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలను తీసుకొస్తే.. వాటినీ నిర్వీర్యం చేసిందని.. వైద్య సీట్లు వద్దంటూ స్వయంగా ప్రభుత్వమే లేఖ రాసిందని గుర్తు చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారిణి హేమలతకు నాయకులు అందజేశారు.
● కళాశాలకు వెళ్లాలంటే
భయమేస్తోంది
కళాశాల యాజమాన్యం ప్రతిరోజు ఫీజు డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయలేదు. కళాశాలకు వెళ్లాలంటేనే భయంవేస్తోంది.
– మేఘన, పెదపెంకి, బలిజిపేట మండలం
● మోసపోయాం
కూటమి నేతల హామీలు నమ్మి మోసపోయాం. ఎన్నికల ముందు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగమూ లేదు.. నిరుద్యోగ భృతీ అందడంలేదు. యువతను ముంచేశారు.
– వంగపండు సాయి, పెదంకలాం,
సీతానగరం మండలం
● ఓటేసి మోసపోయాం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెల కు రూ.3000 చొప్పున ఇస్తామన్న అబద్ధపు హామీని నమ్మి ఓట్లు వేసి మోసపోయాం. ఇంటికీ ఉద్యోగం అన్నారు.. ఒక్కటీ లేదు. యువతను మోసం చేస్తున్న ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుంది. – శ్రీను, మూలభిన్నిధి గ్రామం,
గుమ్మలక్ష్మీపురం మండలం
● యువతకు కుచ్చుటోపీ
కూటమి నేతలు అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి చివరకు యువతకు కుచ్చుటోపీ పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు చదు వుకష్టాలు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు, యువతకు న్యాయం చేసేంత వరకు పోరాడుతాం.
– పాముల పుష్పశ్రీవాణి, మాజీ డివ్యూటీ సీఎం
అడుగడుగునా ఆంక్షలు.. అడ్డగింతలు
నిరుద్యోగులు, యువత గళాన్ని వినిపించేందుకు.. వారి తరఫున ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైఎస్సార్సీపీ చేపట్టిన యువత పోరుకు కూటమి ప్రభు త్వం అడుగడుగునా ఆంక్షలు పెట్టింది. పోలీసుల ను ఉపయోగించి.. ఆందోళన కార్యక్రమాన్ని అడ్డగించేందుకు అన్ని దారులూ వెతికింది. తొలుత నిరసన కార్యక్రమానికి అనుమతులు లేవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, నిరుద్యోగులు, యువత పట్టణంలో ర్యాలీ ప్రారంభించగానే.. అనుమతులు లేవంటూ అడ్డుకున్నారు. తాము శాంతియుతంగానే చేపడు తున్నామని వైఎస్సార్సీపీ నాయకులు చెప్పడంతో.. డ్రోన్ కెమెరా నిఘాతో ర్యాలీని కొంత దూరం వరకూ అనుమతించారు. కలెక్టరేట్కు వెళ్లనీయకుండా దాదాపు 200 మీటర్ల దూరంలో ప్రభుత్వ కళా శాల సమీపంలోనే బారికేడ్లు పెట్టి, రహదారిని బ్లాక్ చేశారు. వినతిపత్రం ఇచ్చే వరకూ తామూ ఇక్కడి నుంచి వెళ్లేది లేదని యువత పెద్ద ఎత్తున నినాదా లు చేయడంలో పోలీసులు వెనక్కి తగ్గారు. పరిమి త సంఖ్యలో నాయకులే వెళ్లాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్ గేటు వద్ద కూడా కాసేపు అడ్డుకున్నారు. కొంతసేపు చర్చల తర్వాత ముఖ్య నాయకులను మాత్రమే లోపలికి వదిలారు.
ఇబ్బందులకు గురవుతున్నాం..
గతంలో పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లల చదువుకు సమయానికి విద్యా, వసతి దీవెన పథకాల కింద నిధులు జమచేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 10 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్కరూపాయి కుడా ఇవ్వలేదు. కళాశాలల ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి విద్యార్థులను ఆదుకోవాలి.
– హేమలత, చిలకల్లి గ్రామం, బలిజిపేట మండలం
ఆగ్రహ జ్వాల
ఆగ్రహ జ్వాల
ఆగ్రహ జ్వాల
ఆగ్రహ జ్వాల
ఆగ్రహ జ్వాల
ఆగ్రహ జ్వాల
ఆగ్రహ జ్వాల
ఆగ్రహ జ్వాల
ఆగ్రహ జ్వాల
ఆగ్రహ జ్వాల
ఆగ్రహ జ్వాల