వైభవంగా వేణుగోపాలస్వామి ఆలయ ప్రారంభోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా వేణుగోపాలస్వామి ఆలయ ప్రారంభోత్సవం

Jun 3 2023 1:32 AM | Updated on Jun 3 2023 1:32 AM

చినజీయర్‌స్వామి ప్రవచనాల్లో కూర్చొన్న మంత్రి బొత్స దంపతులు  - Sakshi

చినజీయర్‌స్వామి ప్రవచనాల్లో కూర్చొన్న మంత్రి బొత్స దంపతులు

పాల్గొన్న చినజీయర్‌స్వామి,

మంత్రి బొత్స దంపతులు, ఎంపీ బెల్లాన

చీపురుపల్లిరూరల్‌(గరివిడి): గరివిడి పట్టణంలోని బంగారమ్మకాలనీలో శుక్రవారం వేణుగోపాలస్వా మి ఆలయ ప్రారంభోత్సవం వైభవంగా సాగింది. వేదపండితుల మంత్రోచ్చరణాలతో వేణుగోపాలస్వామి, గోదాదేవి, భగవద్రామానుజాచార్యుల విగ్రహాలను ప్రతిష్టించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఇరిగేషన్‌ డైరెక్టర్‌, ఆలయ ధర్మకర్త బమ్మిడి అప్పలస్వా మి, కష్ణమ్మ దంపతులు, ఆలయ కమిటీ సభ్యుల నేతత్వంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు సాగా యి. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి, రాష్ట్ర విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి దంపతులు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, వందలాదిమంది భక్తులు పూజల్లో పాల్గొన్నారు. ఆలయంలో చినజీయర్‌స్వామి ప్రత్యేక పూజలు జరిపి వేణుగోపాలస్వామి విశిష్టతను భక్తులకు వివరించారు. మంత్రి బొత్స దంపతులకు, భక్తులకు ఆశీర్చనాలు అందజేశారు. ప్రతిష్టోత్సవాల్లో ప్రభాతారాధన, మంగళాశాశనం, తీర్థగోష్టి, వాస్తుహోమం, ధాన్యాధివాసం, విశేషహోమాలు, పెరుమాళ్లకు పంచామృతాభిషే కం, పంచ వయ్యాధివాసం, వేదపారాయణం తదితర పూజలు జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement