మాది రైతు ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

మాది రైతు ప్రభుత్వం

Jun 3 2023 1:32 AM | Updated on Jun 3 2023 1:32 AM

యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జోగారావు  - Sakshi

యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జోగారావు

–8లో
శనివారం శ్రీ 3 శ్రీ జూన్‌ శ్రీ 2023
● రైతన్నల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం: ఎమ్మెల్యే జోగారావు ● ప్రతి అడుగు రైతు శ్రేయస్సు కోసమే: కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ ● 50 శాతం రాయితీతో 78 సీహెచ్‌సీలకు ట్రాక్టర్లు అందజేత ● వైఎస్సార్‌ యంత్రసేవా పథకం కింద వ్యవసాయ పరికరాల పంపిణీ

రెంటికీ చెడ్డ రేవడిలా..!

శతాబ్దం క్రితం జరిగిన పొరపాటు ఆగ్రామ రైతుల పాలిట శాపంగా మారడంతో నేటికీ

అవస్థలు పడుతున్నారు.

ఉపయోగకరం

జిల్లాలో 80 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారప డి జీవిస్తున్నారు. ఈ ప్రాంత రైతులకు వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం చాలా ఉపయోగకరం. ఆర్బీకేల ద్వారా విత్తనా లు, ఎరువులు, సాగు పరికరాలను అందిస్తోంది. వ్యవసాయ సలహామండలి కూడా ఏర్పాటు చేసింది. కూలీల కొరతను అధిగమించాలంటే యాంత్రిక వ్యవసాయం తప్పనిసరి. సాగులో యంత్రాల వినియోగంతో సమయం కలిసివ స్తుంది. ప్రభుత్వ రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

– వాకాడ నాగేశ్వరరావు, జిల్లాల వ్యవశాయ సలహా మండలి అధ్యక్షుడు,

పార్వతీపురం మన్యం

పార్వతీపురంటౌన్‌:

మాది రైతు ప్రభుత్వమని, రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే అలజంగి జోగారావు తెలిపారు. రైతు విత్తనం వేసిన నాటి నుంచి పంట విక్రయించే వరకు రైతు శ్రేయ స్సు కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పార్వతీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో రెండవ విడత వైఎస్సా ర్‌ యంత్ర సేవా పథకం జిల్లాస్థాయి మెగా మేళాను శుక్రవారం నిర్వహించారు. రైతు గ్రూపులకు ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే, ఇతర అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రైతుల అవసరాలను గుర్తిస్తూ.. రాయితీలు, పథకాలు అందజేస్తున్నారన్నారు. ఇప్పటికే వైఎస్సా ర్‌ రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలకు జమచేసినట్టు వెల్లడించారు. విపత్తుల సమయంలో రైతు నష్టపోకుండా ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద పంట నష్ట పరిహారం అందిస్తున్నారన్నారు.

యాంత్రీకరణతో సాగు సులభం

వ్యవసాయంలో యాంత్రీకరణ వల్ల సాగు సులభమ వుతుందని కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ తెలిపారు. ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలోని కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ల రైతు గ్రూపులకు ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలను 50 శాతం రాయితీపై అందజేస్తున్నట్టు వెల్లడించారు. వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం రెండో విడతగా 127 కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లను ఏర్పాటుచేసి రైతు గ్రూపుల పేరున బ్యాంకు ఖాతా తెరిపించి లబ్ధిదారులకు పారదర్శకంగా అందిస్తున్నామన్నా రు. జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల పరిధిలో 78 ట్రాక్టర్లకు యూనిట్‌ విలువ రూ.5.69 కోట్లు కాగా రూ.కోటి 94 లక్షల సబ్సిడీ పొందారన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసా య సలహామండలి అధ్యక్షుడు వాకాడ నాగేశ్వరరావు, ఆత్మా చైర్మన్‌ ఆండ్రాపు తిరుపతి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి, మండల పరిషత్‌ అధ్యక్షురాలు మజ్జి శోభారాణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాబర్ట్‌ పా ల్‌, వ్యవసాయ అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సాగు ఖర్చు తగ్గించేలా..

వ్యవసాయంలో యంత్రా ల వినియోగాన్ని ప్రోత్సహించి సాగుఖర్చు తగ్గించాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. దీనివల్ల రైతుకు పెట్టుబడి మిగులుతుంది. పని సులభమవుతుంది. రైతులకు విత్తనాల నుంచి పంట కొనుగోలు వరకు సేవలందించేందుకు ఆర్బీకేలను ఏర్పాటు చేసింది. ఇ–క్రాప్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. రైతు సంక్షేమానికి తొలిప్రాధాన్యమి స్తోంది. రాయితీపై అందించే ట్రాక్టర్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

– రాబర్ట్‌పాల్‌, జిల్లా వ్యవశాయశాఖాధికారి, పార్వతీపురం మన్యం

జెండా ఊపి ట్రాక్టర్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌, ఎమ్మెల్యే జోగారావు

రైతు గ్రూపులకు రాయితీపై పంపిణీ చేసిన ట్రాక్టర్లు

న్యూస్‌రీల్‌

ప్రభుత్వం మేలు మరచిపోలేం

మా రైతు మిత్ర సంఘానికి రూ.7.32 లక్షలు విలువ చేసే ట్రాక్టర్‌ మంజూరైంది. రాయితీ కింద రూ. 2,95,188 లక్షలు మంజూ రైంది. మిగిలిన 50 శాతం బ్యాంకు రుణంగా మంజూరు చేశారు. ట్రాక్టర్‌ మంజూరుతో సాగు సులభమవుతుంది. అద్దె కష్టాలు తప్పుతాయి. విత్తనం నుంచి కొనుగోలు వరకు రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం రైతులకు చేస్తున్న మేలును మరచిపోలేం.

– యర్రా శ్రీరాములు, శ్రీవెంకటేశ్వర రైతు మిత్ర గ్రూపు, సీతానగరం మండలం

రైతన్నలకు అండగా...

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. రైతులను ప్రభు త్వం అనేక పథకాలతో ఆదుకుంటోంది. సాగు భరోసా కల్పిస్తోంది. యంత్ర సాయం కింద మా గ్రూపునకు రూ.3 లక్షల రాయితీని అందజేశారు. రైతులకు అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటోంది. సాగును లాభదాయకం చేయాలన్న ఉద్దేశంతో అనేక రాయితీలు కల్పిస్తున్నారు. రైతన్నలకు అండగా నిలుస్తున్నారు.

– గంటా పెంకట నాయుడు, శ్రీ సాయిరాం రైతు మిత్ర గూపు, జియ్యమ్మవలస మండలం

విత్తనం నుంచి కొనుగోలు వరకు...

రైతులు వేసే విత్తనాల నుంచి పంట కొనుగోలు చేసేంతవరకు ఆర్బీకే సిబ్బంది, ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పంటకోతల్లో ఖర్చు తగ్గించేందుకు యంత్ర సాయం పథకం ద్వారా రూ.3.07 లక్షల సబ్సీడీతో అందజేశారు. రైతన్నలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటోంది. ప్రభుత్వం సూచించిన ధరకే అద్దెకు ఇచ్చి రైతులకు అండగా నిలుస్తాం.

– బి.వేణుగోపాలరావు, పాలకొండ

1
1/8

2
2/8

3
3/8

పైడిరాజును అభినందిస్తున్న డిప్యూటీ సీఎం, 
గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర 4
4/8

పైడిరాజును అభినందిస్తున్న డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర

5
5/8

6
6/8

7
7/8

8
8/8

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement