పేదల ఇంటిపై కూటమి కక్ష | - | Sakshi
Sakshi News home page

పేదల ఇంటిపై కూటమి కక్ష

Jun 9 2025 10:16 AM | Updated on Jun 9 2025 10:16 AM

పేదల

పేదల ఇంటిపై కూటమి కక్ష

కూటమి ఏడాదిలో పాలనలో పేదలకు తప్పని వేదన

జగనన్న ఇచ్చిన స్థలం నేడు రద్దు

జగనన్న ఇంటి పట్టా ఇస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ఆ పట్టా రద్దు చేశారు. కూలీ పనులకు వెళితేనే ఇల్లు గడుస్తుంది. ఇద్దరు పిల్లలకు గతంలో అమ్మ ఒడి పథకం ద్వారా డబ్బులు ఇచ్చారు. ఏడాది కాలంగా ఆ డబ్బులు కూడా రాలేదు. ఇంటి అద్దె నెలకు రూ.మూడు వేలు చెల్లించాల్సి వస్తోంది. స్థలం ఇస్తే అద్దె బాధ తప్పుతుందని ఎదురుచూస్తున్నాం. ఇచ్చిన స్థలం కూడా రద్దు చేయడం దారుణం. ఏ ఎంకై ్వరీ చేసినా ఎక్కడా ఎటువంటి ఆస్తులు లేవు. ఉండటానికి ఇల్లు కూడా లేదు. పేదోళ్లకు ఇంటి స్థలం రావడం టీడీపీ నాయకులకు ఇష్టం లేదు.

పేదల ఇళ్లకు గ్రహణం పట్టింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్లు లేని పేదల కోసం పట్టణ ప్రాంతాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర భూమి ఉచితంగా ఇచ్చారు. పైగా ఇల్లు కట్టుకునేందుకు ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు కూడా మంజూరు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఇంత వరకు ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. పేదలంటే సీఎం చంద్రబాబుకు ఎంత చిన్నచూపో మరోసారి ఆయన నిర్దయ వైఖరితో స్పష్టంగా అర్థమవుతోంది.

– షేక్‌ రిజ్వానా,

పెదకాకాని

పేరేచర్లలోని

జగనన్న కాలనీ

అద్దె కట్టలేక అవస్థలు

ఇంటికి అద్దె కట్టలేక అల్లాడుతున్నాం. ఎక్కడ ఇంటి స్థలం ఇస్తే అక్కడకు వెళతాం. కానీ కూటమి ప్రభుత్వంలో పాలకులు ఇవ్వరు.. ఇచ్చేవారిని ఇవ్వనీయరు. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇళ్ల స్థలాలు ఇస్తారని ఎదురు చూశాం. ఒక్కరికి కూడా పట్టా రాలేదు. నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నవులూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఆ రోజే స్థలాలు కూడా చూపించారు. ఇల్లు కట్టుకుంటే అద్దె బాధలు తప్పుతాయని సంతోషించాం. కూటమి సర్కారు వచ్చాక రాజధానిలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు చేశామన్నారు. ఇప్పుడు ఇంటి స్థలం ఇస్తారో, లేదో?

సాక్షి ప్రతినిధి, గుంటూరు గుంటూరు జిల్లాలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 73,804 ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణాలకు పచ్చజెండా ఊపారు. సీఆర్‌డీఏ పరిధిలో కూడా పేదలు ఉండాలనే ఉద్దేశంతో 23,726 ఇళ్ల స్థలాలను ప్రభుత్వం కేటాయించింది. రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదనే ఉద్దేశంతోనే కోర్టులో పిటిషన్లు వేసి అక్కడ ఇళ్ల నిర్మాణాలు చేయించకుండా ఆపేశారు.

గృహ ప్రవేశాల పేరుతో హడావుడి

చేసిందేమీ లేకున్నా రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేసేశానని చెప్పుకొనేందుకు సీఎం చంద్రబాబు ఎప్పుడూ తాపత్రయ పడుతుంటారు. అదే కోవలో జూన్‌ 12వ తేదీన ఆయన ప్రమాణం స్వీకారం చేసి సంవత్సరం కావస్తోందని రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహ ప్రవేశాలు పూర్తి చేయాలంటూ ప్రతి జిల్లాకు లక్ష్యం విధించారు. సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడంతో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదనే చెప్పుకోవాలి. గుంటూరు జిల్లాలో జూన్‌ 12వ తేదీ నాటికి 11,049 ఇళ్లు పూర్తి చేయాలని టార్గెట్‌ ఇచ్చారు. అయితే ఇప్పటికి వరకు జిల్లాలో పూర్తయింది కేవలం 5,612 మాత్రమే. మిగిలినవి ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి.

రాజధానిలో పేదలు ఉండకూడదనే....

ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి రాగానే ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశంలో రాజధానిలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేశారు. వారి సొంత గ్రామాల్లోనే స్థలాలు ఇవ్వాలని ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 50,793 మంది పేదలకు కోర్టులో పోరాడి గెలిచి పట్టాలు ఇచ్చి ఇల్ల్లు కట్టించే ప్రయత్నం చేస్తే... వాటిని చంద్రబాబు అడ్డుకున్న సంగతి తెలిసిందే. సామాన్యుడికి రాజధానిలో ఇళ్లు కట్టుకోవడానికి భూములు కూడా ఇవ్వలేనప్పుడు ఇది ప్రజా రాజధాని ఎలా అవుతుందని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. అమరావతిలో పేదవాడికి భూమి ఇచ్చినప్పుడు ‘సెంటు కంపు‘ అని పచ్చపత్రికల్లో రాయించి, సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుల్లో వాదించారు. ఇప్పుడు ఏకంగా వారిని అక్కడి నుంచి పంపించి వేయడానికే కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై బాధితులు కోర్టును ఆశ్రయించారు. సీఆర్డీఏ పరిధిలో 25 లే అవుట్లలో విద్యుత్‌ సదుపాయాలకు రూ.326.51 కోట్లు, ఇళ్ల నిర్మాణాల కోసం తాత్కాలిక నీటి సరఫరా కొరకు రూ.31.79 కోట్లు, అనుసంధాన రహదారుల ఏర్పాటు కోసం రూ.7.61 కోట్లతో పనులు మొదలుపెట్టారు. పేదల వ్యతిరేకులంతా హైకోర్టులో 18, సుప్రీంకోర్టులో ఐదు కేసులు వేశారు. తాజాగా రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ ఐకాస పేరుతో హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. వీటిని విచారించి ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత ఏడాది ఆగస్టు నుంచి ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఏకంగా వారికి ఇచ్చిన పట్టాలు రద్దు చేసి సొంత గ్రామాల్లోనే ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు కూటమి తీరుతో ఆవేదన చెందుతున్నారు.

– తుమ్మా నీలు, అగతవరప్పాడు

రోడ్డు పక్కనే గుడిసెలో ఉంటున్నాం

రహదారి పక్కన గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నాం. తెనాలి నందివెలుగు రోడ్డు విస్తరణకు సహకరించి, రోడ్డుకు రెండు పక్కల ఉండే వారందరం ఆరు అడుగుల స్థలాన్ని ఇచ్చాం. మా ఇళ్లను ఆనుకుని రేయింబవళ్లు లారీలు, బస్సులు వంటి పెద్ద వాహనాలు అతి వేగంగా తిరుగుతున్నాయి, ఎప్పుడు ఏ వాహనం అదుపు తప్పి మా గుడిసెలోకి దూసుకొస్తుందోనని భయంగా ఉంది. మేం నివాసం ఉండే గుడిసెలకు ఒక పక్క మురుగు కాలువ, మరో పక్కన నిత్యం వాహనాల రద్దీ ఉంటోంది. మా బాధలు అర్థం చేసుకుని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాం.

– కగ్గా సుధారాణి, తక్కెళ్ళపాడు

గత ప్రభుత్వం గుంటూరు జిల్లాలో రెండు వందలకుపైగా లే అవుట్స్‌ ఏర్పాటు చేసింది. అక్కడ ఇళ్ల నిర్మాణాలు దశలవారీగా చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. మొదటి దశ కింద గుంటూరు జిల్లాలో 73,804 ఇళ్లు మంజూరయ్యాయి. వాటిని మాత్రమే కూటమి ప్రభుత్వం పూర్తి చేసి ఆ తరువాత మిగిలిన లే అవుట్లను స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో గూడు లేక నిరుపేదలకు అవస్థలు

అటకెక్కిన ‘గృహ నిర్మాణం’

ఏడాదిలో 5,612 మాత్రమే పూర్తి

జూన్‌ 12న గృహ ప్రవేశాలంటూ ప్రచారం కోసం హడావుడి

లక్ష్యంలో సగం కూడా పూర్తి కాకపోయినప్పటికీ ఆర్భాటం

సకాలంలో బిల్లులు అందక ఇళ్ల నిర్మాణానికి తీవ్ర అడ్డంకులు

రాజధానిలో ఇచ్చిన వేల ఇళ్ల స్థలాలు నిర్దయగా రద్దు

లే అవుట్ల

స్వాధీనానికి

యత్నం?

పేదల ఇంటిపై కూటమి కక్ష 1
1/6

పేదల ఇంటిపై కూటమి కక్ష

పేదల ఇంటిపై కూటమి కక్ష 2
2/6

పేదల ఇంటిపై కూటమి కక్ష

పేదల ఇంటిపై కూటమి కక్ష 3
3/6

పేదల ఇంటిపై కూటమి కక్ష

పేదల ఇంటిపై కూటమి కక్ష 4
4/6

పేదల ఇంటిపై కూటమి కక్ష

పేదల ఇంటిపై కూటమి కక్ష 5
5/6

పేదల ఇంటిపై కూటమి కక్ష

పేదల ఇంటిపై కూటమి కక్ష 6
6/6

పేదల ఇంటిపై కూటమి కక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement