Sakshi News home page

Published Sun, Feb 26 2023 1:12 AM

-

‘ఏ డే విత్‌ కలెక్టర్‌’లో విద్యార్థులతో కలెక్టర్‌
నరసరావుపేట: విద్యార్థి దశలో ఉన్నప్పుడే లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ పేర్కొన్నారు. ఏ డే విత్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో విద్యార్థులతో సమావేశమయ్యారు. వారిని పరిచయం చేసుకొని విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. లక్ష్యాలకు చేరుకోవాలంటే అందుకు తగిన విధంగా అన్ని విషయాలపై పట్టుసాధించాలని పేర్కొన్నారు. ఉన్నత చదువులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ (పీపీటీ) ద్వారా వివరించారు. మెదడుకు పదును పెట్టేలా విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగి చక్కని జవాబులు చెప్పిన వారికి బహుమతులు అందజేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement