తుఫాన్‌ సమయంలో 136 మంది జననం | - | Sakshi
Sakshi News home page

తుఫాన్‌ సమయంలో 136 మంది జననం

Oct 31 2025 8:04 AM | Updated on Oct 31 2025 8:04 AM

తుఫాన

తుఫాన్‌ సమయంలో 136 మంది జననం

కొరాపుట్‌: మోంథా తుఫాన్‌ సమయంలో 136 మంది శిశువులు జన్మించినట్లు కొరాపుట్‌ జిల్లా వైద్యశాఖాధికారులు ప్రకటించారు. గురువారం కొరాపుట్‌ జిల్లా అదనపు వైద్యాధికారి నీల మాధవ్‌ సత్పతి విలేకరులతో మాట్లాడారు. శిశువుల్లో 67 మంది అబ్బాయిలు, 69 మంది అమ్మాయిలు ఉన్నారన్నారు. ఒక కవల జంట జననం జరిగిందన్నారు. తుఫాన్‌ నేపథ్యంలో ముందుగా తాము 332 మంది గర్భిణులను అస్పత్రులు, ప్రసూతి గృహాలకు తరలించినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రసవ సమయంలో వీరందరికి సహాయం అందిందన్నారు. గర్భిణులను తరలించడానికి అన్ని మార్గాలను వినియోగించుకున్నామని వెల్లడించారు. అంబులెన్సులు వెళ్లలేని కొండ మార్గాలకు బైక్‌ అంబులెన్సులు ఉపయోగించామన్నారు. కొన్నిచోట్ల పడవల్లోనూ గర్భిణులను తరలించినట్లు తెలిపారు.

తుఫాన్‌ సమయంలో 136 మంది జననం 1
1/1

తుఫాన్‌ సమయంలో 136 మంది జననం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement