
లోక బాంధవ శతకం పుస్తకావిష్కరణ
శ్రీకాకుళం కల్చరల్: స్థానిక ఉపనిషన్మందిరంలో పైడి హరనాథరావు రచించిన లోక బాంధవ శతకం పుస్తకావిష్కరణ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా రచయిత మాట్లాడుతూ ఈ శతక పద్యములను సమాజ శ్రేయస్సు కాంక్షించి రచించినట్లు పేర్కొన్నారు. ధాన్యం పండించే రైతు, మంచుకొండల్లో ప్రాణాలు పణంగా పెట్టిన సైనికుడుపై పద్యాల రచన జరిగిందన్నారు. కార్యక్రమంలో నారాయణమూర్తి, కోమలరావు, నిష్టల నరసింహమూర్తి, బలివాడ మల్లేశ్వరరావు, గుమ్మా నగేష్, శివరాం, విశ్వనాథం కామేశ్వరరావు, ఎం.శ్రీనివాసరావు, పట్నాయిక్, విశ్వేశ్వరరావు, రమణ, సూరిబాబు, సరస్వతి, లక్ష్మి, విజయలక్ష్మి, అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.