
నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకానికి జిల్లాలో జి.సిగడాం మండలం ఎస్పీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన తేజోమూర్తుల ఫణికుమార్ కుటుంబ సభ్యులు రూ.లక్ష విరాళంగా ఆదివారం అందజేశారు. ఈ మేరకు ఆలయ ఈవో వై.భద్రాజీకి విరాళ చెక్కును అందజేసి, ఆలయం నుంచి రశీదును పొందారు. అంతకుముందు ఆదిత్యునికి అంతరాలయం దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తదితరులు పాల్గొన్నారు.
యథేచ్ఛగా ఇసుక దందా
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పలు ప్రాంతాలకు వేలాది టిప్పర్లు, లారీలతో నిత్యం యథేచ్ఛగా ఇసుక సరఫరా జరుగుతోంది. నాయకులు ప్రాంతాల వారీగా ఒప్పందం కుదుర్చుకుని ఇసుకను ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ, మైనింగ్, ఎకై ్సజ్, మున్సిపల్ ఇలా అన్ని శాఖల అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉచిత ఇసుక అని చెప్పి సొమ్ము చేసుకుంటున్న తీరు బహిరంగంగా జరుగుతున్నా దీనిపై ఎవరూ మాట్లాడకపోవడం ఆశ్చర్యకరం.
త్రుటిలో తప్పిన ప్రమాదం
రణస్థలం: మండల కేంద్రంలోని రామతీర్థాలు కూడలి వద్ద విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు ముందు వెళ్తున్న లారీని వెనుకనుంచి వచ్చిన మరో లారీ ఢీకొంది. అదివారం మధ్యాహ్నం సమయంలో ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేకు వేయడంతో వెనుక వస్తున్న లారీ డ్రైవర్ క్షణాల్లో అప్రమత్తమై బ్రేకు వేసినా నెమ్మదిగా ఢీకొంది. దీంతో లారీ ముందరి భాగం బాగా దెబ్బతినడంతో చాలా సేపు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. డ్రైవర్ చిన్న, చిన్న గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జేఆర్పురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
గార: ద్విచక్ర వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొందూరు మండలంలోని మొదలవలస గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన రావాడ ఆనందరావు(28), అతని స్నేహితుడు దూగాన గణపతి ఇరువురు కలిసి ఫొటోలు తీసేందుకు శ్రీకూర్మం వైపు వెళ్తున్నారు. అయితే ఆదివారం సాయంత్రం కోళ్లపేట జంక్షన్ సమీపంలోకి వచ్చేసరికి ప్రమాదం చోటుచేసుకుంది. రావాడ ఆనందరావు తల విద్యుత్ స్తంభానికి తగలడంతో అక్కడే మృత్యువాతపడ్డాడు. గణపతికి గాయాలవ్వగా 108 వాహ నం ద్వారా రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏఎస్ఐ తెలుగు చంద్రమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం బాటిళ్ల పట్టివేత
ఎచ్చెర్ల: లావేరు మండలంలోని బుడుమూరు నుంచి కొత్తూరుపేటకు అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను లావేరు పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. మద్యం అక్రమంగా తరలిస్తున్న కింతలి లక్ష్మణరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం

నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం

నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం