పర్లాకిమిడి: ఒడిశాలో ఆదివారం భువనేశ్వర్లో ట్రాన్స్జెండర్స్ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కేసరి హోటల్లో సమావేశం జరిగింది. గజపతి జిల్లా నుంచి ట్రాన్స్ జెండర్స్ సంఘం కార్యదర్శి జాస్మిన్ షేక్, సభ్యురాలు లిన్ను సుబుద్ధి పాల్గొన్నారు. ఒడిశా ప్రభుత్వం తరఫున ట్రాన్స్జెండర్ప్కు వివిధ సంక్షేమ పథకాలు, ఉపాధి, విద్య, ఉచిత వైద్యం, ఇళ్ల పట్టాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని సభ్యులు అధికారులను కోరారు. దీనిపై ఒడిశా అధికారులు సానుకూల వైఖరి అవలంబించినట్టు గజపతి జిల్లా ట్రాన్స్జెండర్స్ కార్యదర్శి జాస్మిన్ షేక్ తెలియజేశారు.
ట్రాన్స్జెండర్స్కు సంక్షేమ బోర్డు ఏర్పాటు