
రోడ్డును విస్తరించాలి
పర్లాకిమిడి: పట్టణంలోని టౌన్ రోడ్డును పూర్తిగా విస్తరించాలని, దీనిపై రెండేళ్ల క్రితం ఖంజా వీధి నుంచి మార్కెట్, కొత్త బస్టాండ్ వరకు సేకరించిన భూమిని డెవలప్మెంట్ చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బసంత పండా బుధవారం కలెక్టర్కు రాసిన వినతిని సబ్ కలెక్టర్ అనుప్పండాకు కలెక్టరేట్లో అందజేశారు. పట్టణంలో పలు కూడళ్లల్లో ఆక్రమణదారులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించారన్నారు. రోడ్లు–భవనాల శాఖ ఇంజినీర్లు ఎందుకు రోడ్డును విస్తరించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పలుకుబడి ఉన్న వ్యాపారుల దుకాణాలను తొలగించకుండా పనులు సాగిస్తున్నారని వివరించారు. దీనిపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి టౌన్ రోడ్డును 66 అడుగుల మేరకు విస్తరించాలని కోరారు.
చోరీ కేసులో ఇద్దరు అరెస్టు
రాయగడ: జిల్లాలోని కళ్యాణ సింగుపూర్ సమితి సికిరపాయిలో నివసిస్తున్న గొపాలశెఠి ఉపేంద్ర ఇంట్లో ఇటీవల జరిగిన చోరీ కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో సికరపాయి గ్రామానికి చెందిన గెంబలి చందన్ కుమార్, గురుతులి గ్రామానికి చెందిన గుడ్ల సంతోష్కుమార్ ఉన్నారు. గత నెల 11వ తేదీన ఇదే కేసుకు సంబంధించి ఈశ్వర్ నాయక్ అనే నిందితుడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ప్రత్యేకంగా ఏర్పడిన పోలీస్ బృందం ఈ మేరకు దర్యాప్తు చేస్తుంది. బిసంకటక్, కాసీపూర్, జేకేపూర్ నియమగిరి పర్వత ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్న ఈ బృందం ఈ మేరకు నిందితులను పట్టుకోవడంలో సఫలీకృతమవుతుంది. కళ్యాణ సింగుపూర్ ఐఐసీ నీలకంఠ బెహర మాట్లాడుతూ.. కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు.
దాడి కేసు నమోదు
కవిటి: మండలంలో డి.గొనపపుట్టుగ గ్రామంలోని ఎస్సీ వీధికి చెందిన బోనేల హరికృష్ణపై ప్రత్యర్థి వర్గీయులు దాడిచేసి గాయపర్చడంతో 108 అంబులెన్స్లో కవిటి ప్రభుత్వ ఆస్పత్రి వెళ్లాడు. అక్కడి ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు కవిటి పోలీస్స్టేషన్లో బోనేల హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంఎల్సీ కేసు నమోదు చేశామని ఎస్ఐ వి.రవివర్మ బుధవారం తెలియజేశారు. తన కొబ్బరితోటలో కాయలు, కమ్మలను ప్రత్యర్థి వర్గంవారు తీసుకెళ్తుంటే అడ్డుకున్నాననే నెపంతో కర్రలతో కొట్టి, కారంచల్లి తీవ్రంగా గాయపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్ఐ తెలిపారు. అదేవిధంగా ఈ కొట్లాటలో తమకు కూడా గాయాలయ్యాయని ప్రత్యర్థి వర్గీయురాలు తెంబ సరోజిని అనే మహిళ సైతం కవిటి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.

రోడ్డును విస్తరించాలి