ఎన్‌కేటీ రోడ్డు విస్తరణకు కొలతలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఎన్‌కేటీ రోడ్డు విస్తరణకు కొలతలు ప్రారంభం

May 29 2025 1:13 AM | Updated on May 29 2025 1:13 AM

ఎన్‌క

ఎన్‌కేటీ రోడ్డు విస్తరణకు కొలతలు ప్రారంభం

జయపురం: జయపురం మున్సిపాలిటీలోని ఎన్‌కేటీ రోడ్డు విస్తరణకు అధికారులు బుధవారం శ్రీకారం చుట్టారు. జయపురం సబ్‌కలెక్టర్‌, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కుమారి అక్కవరమ్‌ శొశ్యారెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం మున్సిపాలిటీ ఇంజినీర్లు, సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు, పోలీసుల సమక్షంలో 40 అడుగుల రోడ్డు విస్తరణకు కొలతలు ప్రారంభించారు. పట్టణ ప్రధాన మార్గం వల్లబాయి పటేల్‌ రోడ్డు నుండి నుంచి ఎన్కేటీ రోడ్డును ప్రభుత్వ ఉన్నత పాఠశాల మీదుగా నీలకంఠేశ్వర మందిర కూడలి వరకు ఆక్రమణలు తొలగించి రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే వల్లభాయి పటేల్‌ మార్గం నుండి 80 మీటర్ల వరకు 30 అడుగుల రోడ్డు ఉంటుందని పేర్కొన్నారు. అందుకు ప్రధాన కారణం 80 మీటర్ల వరకు ఉత్తర వైపు ప్రజల నివాస గృహాలు ఉన్నాయి. దక్షిణ వైపు జయపురం మహారాజు కోట ఎత్తైన ప్రహరీ ఉండటం వలన అంతవరకు 30 అడుగుల వెడల్పు రోడ్డు, అక్కడ నుంచి నీలకంఠేశ్వర మందిర కూడలి వరకు 40 అడుగుల రోడ్డు వేస్తామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రోడ్డు విస్తరణకు కొలతలు ప్రారంభించారు. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్‌కేటీ రోడ్డు విస్తరణకు కొలతలు ప్రారంభం 1
1/1

ఎన్‌కేటీ రోడ్డు విస్తరణకు కొలతలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement