● బైక్ దొంగల గుట్టు రట్టు
● నలుగురు నిందితుల అరెస్టు
జయపురం: ఒక బైక్ దొంగతనం కేసును దర్యాప్తు చేస్తే మొత్తం బైక్ దొంగల గుట్టు రట్టయ్యింది. జయపురం పట్టణ పోలీసులకు అందిన ఒక కేసు దర్యాప్తు జరపగా అనేక బైక్ దొంగతనం కేసులు బయట పడ్డాయి. జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీస్ కాశ్యప్ శుక్రవారం మధ్యాహ్నం పట్టణ పోలీస్స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. గత నెల 27న జయపురం సౌరసాహి వాసి కార్తీక మహాపాత్రో(19) తన బైక్ పోయిందని ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఆ మేరకు దర్యాప్తు ప్రారంభించామని దర్యాప్తులో నరసింగ ఉరఫ్ నరేష్ దవురుని అదుపులోకి తీసుకుని విచారణ చేశామని తెలిపారు. అయితే తాను ఒక్కడినే కాదని, తనతో బొరిగుమ్మ సమితి బొడొదుబులి గ్రామ వాసి అనిల్ హరిజన్(33) కూడా ఉన్నాడని బయటపెట్టాడని పేర్కొన్నారు. ఇద్దరూ కలిసి దొంగిలించిన బైక్లు అన్నీ నవరంగపూర్ జిల్లా మైదల్పూర్ డెంగా సాహి లక్ష్మణ హరిజన్(50) ఇంటిలో ఉంచామని వెల్లడించినట్లు పోలీసు అధికారి తెలిపారు. అనంతరం దొంగిలించిన మోటారు 22 బైక్లు అన్నీ లక్ష్మణ మఝి, భీమ ఖిలోల ద్వారా మల్కన్గిరి, కొరాపుట్, నవరంగపూర్ జిల్లాల మారుమూల ప్రాంతాల్లో రూ.10వేలు, రూ.15వేలకు అమ్మేసినట్లు తెలిపారని పేర్కొన్నారు. ఆ బైక్లన్నీ లక్ష్మణ్, భీమ ఖిలోల ద్వారా రికవరీ చేసినట్లు వెల్లడించారు.
నిందితుడు అనిల్ హరిజన్ దొంగిలించిన మోటారు బైక్లను మైదల్పూర్ లక్ష్మణ ఇంటి సమీపంలో చేర్చి ఒక్కో కస్టమర్ను ఏర్పాటు చేసి వారికి అమ్ముతున్నట్లు వెల్లడించారు. బైక్ దొంగతనంలో ఆరితేరిన అనిల్ హరిజన్ను గతంలో బొరిగుమ్మ పోలీసులు అరెస్టు చేశారని, అప్పట్లో అతడి నుంచి 15 బైక్లు రికవరీ చేశారని పోలీసు అధికారి కాశ్యప్ వెల్లడించారు. రెండు నెలల కిందటే అనిల్ బెయిల్పై విడుదలయ్యాడని తెలిపారు. అతడు జయపురం పట్టణం, జయపూర్ సదర్, అంపాణి, బొరిగుమ్మ, బొయిపరిగుడ, రాయిఘర్, నవరంగపూర్, సునాబెడ, మొదలగు పోలీసు స్టేషన్ల పరిధిలో బైక్ దొంగతనాలు చేశాడని వెల్లడించారు. గురువారం సాయంత్రం వారిని అరెస్టు చేసి శుక్రవారం హాజరు పరిచామని చెప్పారు. ఇంకొన్ని బైక్ల వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
బైక్ల అప్పగింత
జయపురం: వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగలు దొంగిలించిన బైక్లను బైక్ల యజమానులకు జయపురం పోలీసు అధికారు శుక్రవారం అప్పగించారు. జయపురం పట్టణ పోలీసులు 22 బైక్లను నిందితుల నుంచి స్వాధీన పరుచుకున్నారు. వాటిని జయపురం సబ్డివిజన్ పోలీసు అధికారి పార్థ జగదీష్ కాశ్యప్, పట్టణ పోలీసు అధికారి అశవిణీ కుమార్ పట్నాయిక్ తదితరుల సమక్షంలో యజమానులకు అప్పగించారు.
22 బైక్ల స్వాధీనం
22 బైక్ల స్వాధీనం
22 బైక్ల స్వాధీనం