
పదో తరగతి ఫలితాలు విడుదల
● జిల్లా వ్యాప్తంగా 98.10 శాతం ఉత్తీర్ణత
పర్లాకిమిడి: పదో తరగతి పరీక్ష ఫలితాలను సెకండ రీ ఎడ్యుకేషన్ బోర్టు శుక్రవారం ప్రకటించింది. గజ పతి జిల్లాలో ఉత్తీర్ణత శాతం 98.10 ఉన్నట్టు జిల్లా ముఖ్యశిక్షాధికారి డాక్టర్ మాయాధర్ సాహు తెలిపారు. ఈసారి బాలికల కంటే బాలుర శాతం అధికంగా పాసయ్యారు. మొత్తం జిల్లాలో 110 ఉన్నత పాఠశాలల్లో పది పరీక్షలు ఫిభ్రవరిలో జరిగాయి. 7685 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా వారిలో 137 మంది గైర్హాజర్ అయ్యారు. ఏ1 (ఫస్టుక్లాస్) 15 మంది ఉత్తీర్ణత అవ్వగా, ఏ2లో 633, బి1లో 2254, బి2లో 2365, కంపార్ట్మెంటల్ 1331, డి గ్రేడ్ 745, ఈగ్రేడ్ 156, ఫెయిల్ 801 మంది ఉన్నారు. మొత్తంగా బాలికలు 20,647 మంది, బాలురు 20783 మంది పాసయ్యారు.
సరస్వతీ శిశు విద్యామందిర్ పాఠశాలలో జిల్లా వ్యాప్తంగా ఏ1 గ్రేడ్ను (90శాతం) 566/600 ప్రజ్యోతి చౌదురి, అంకితా పాఢి 600మార్కులుకు గాను 553 సాధించింది. సరస్వతీశిశు విద్యామందిర్లో శతశాతం పాసయ్యినట్టు ప్రధాన అచార్యులు సరోజ్ పండా తెలియజేశారు.
జయపురంలో 100 శాతం ఫలితాలు
జయపురం: రాష్ట్రంలో మెట్రిక్ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. కొరాపుట్ జిల్లాలో 92 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా తెలుగు సంస్కృతిక సమితిచే నిర్వహించబడుతున్న జయపురం సిటీ ఉన్నత పాఠశాలలో 100 శాతం ఫలితాలు సాధించింది. ఈ పాఠశాల నుంచి 75 మంది మెట్రిక్ పరీక్షలు రాయగా వారంతా ఉత్తీర్ణులు అయ్యారు. వారి లో ఏ–2 గ్రేడ్లో ఒకరు ఉత్తీర్ణ కాగా బి.1 గ్రేడ్లో 11 మంది,బి.2 గ్రేడ్లో 23 మంది.సి.గ్రేడ్లో 32 మంది. డి గ్రేడ్లో 6 గురు, ఇ. గ్రేడ్లో ఇద్దరు ఉత్తీర్ణులైనట్టు పాఠశాల వర్గాలు వెల్లడించాయి.

పదో తరగతి ఫలితాలు విడుదల