
పోలీసు జిమ్ ప్రారంభం
రాయగడ: జిల్లాలోని చందిలి రిజర్వ్ పోలీసు కార్యాలయం ప్రాంగణంలో పోలీసు జిమ్ ప్రారంభమయ్యింది. దక్షిణాంచల్ డీఐజీ అఖి లేశ్వర్ సింహ్ ముఖ్య అతిథిగా హాజరై జిమ్ను మంగళవారం ప్రారంభించారు. వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ముఖ్యంగా పోలీసు విభాగంలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అత్యాధునిక పరికరాల తో ప్రారంభమైన జిమ్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, ఏఎస్పీ బిష్ణు ప్రసాద్ పాత్రో, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కవిబర్ డెవురా తదితరులు పాల్గొన్నారు.
ఈసీహెచ్ఎస్ మొబైల్ యాప్ ప్రారంభం
రాయగడ: గోపాల్పూర్కు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు ఈసీహెచ్ఎస్ (ఎక్స్ సర్వీస్ మెన్ కంట్రీబ్యూటరీ హెల్త్ స్కీమ్) మోబైల్ యాప్ను బరంపురంలోని పాలీ క్లీనిక్లో బుధవారం ప్రారంభించారు. ఈ యాప్ మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు సహకారం అందజేసేవిధంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తున్న సైనికులు వారి కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఈ యాప్లో నమోదు చేసుకొని సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు.
వైభవంగా రామాలయ ప్రతిష్ట
కొరాపుట్: జిల్లా కేంద్రంలోని పూజారిపుట్లో రామాలయ ప్రతిష్ట వైభవంగా బుధవారం నిర్వహించారు. సుమారు 600 మంది మహిళ లు నరేంద్ర సరోవర్ నుంచి కలశాలతో పవిత్ర నీటిని తీసుకొచ్చారు. ఆ నీటితో రాజస్థాన్లో తయారు చేసి దేవతామూర్తుల విగ్రహాలు అభిషేకం చేశారు. మధ్యాహ్నం సమయంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
చీమలమందు తాగి మహిళ ఆత్మహత్య
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు పంచాయతీ ఊడికలపాడు గ్రామానికి చెందిన పినిమింటి లక్ష్మీ(37) చీమల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మీ భర్త రామారావు రోజు మద్యం సేవించి భార్యాపిల్లలతో గొడవ పడేవాడు. ఇంట్లో దాచిపెట్టిన డబ్బులను ఈ నెల 27న తీసుకుపోయి రోజంతా పూటుగా తాగి సాయంత్రం ఇంటికి వచ్చి గొడవకు దిగాడు. మనస్థాపానికి గురైన లక్ష్మీ ఇంట్లో ఉన్న చీమల మందును నీటిలో కలుపుకొని తాగింది. గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుశం రిమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. లక్ష్మికి కుమార్తె జగదీశ్వరి, కుమారుడు శ్యాం ఉన్నారు.
వరకట్న వేధింపులపై కేసులు నమోదు
కాశీబుగ్గ: పలాస మండలం, మున్సిపాలిటీ పరిధిలో వరకట్న వేధింపులపై కేసులు నమోదు చేసినట్లు కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ బుధవారం తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం గ్రామానికి చెందిన కె.ఇందు తన భర్త మహేష్, భర్త కుటుంబ సభ్యులు అదనపు కట్నం తీసుకురమ్మని వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా, పలాస మండలం రెంటికోట గ్రామానికి చెందిన రేఖమ్మ తన భర్త కై లష్హోరి రూ.3లక్షలు అదనపు కట్నం తీసుకురమ్మని వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.
రైలు ఢీకొని వ్యక్తికి
గాయాలు
నరసన్నపేట: మండలంలోని ఉర్లాం రైల్వేస్టేషన్ వద్ద బుధవారం ఉదయం ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఢీకొన్న ఘటనలో కొత్తపోలవలసకు చెందిన తుంగాన గోవిందరావు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాధితుడిని 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జీఆర్పీ హెచ్సీ మధుసూదనరావు కేసు నమోదు చేశారు.

పోలీసు జిమ్ ప్రారంభం

పోలీసు జిమ్ ప్రారంభం