మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికుల ‘వంటా–వార్పు’ | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికుల ‘వంటా–వార్పు’

Jun 2 2025 12:22 AM | Updated on Jun 2 2025 12:22 AM

మున్స

మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికుల ‘వంటా–వార్పు’

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఇంజనీరింగ్‌ కార్మికులకు జీతాలు పెంచాలని, కనీస పెన్షన్‌ రూ.పది వేలు ఇవ్వాలని మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికుల గౌరవ అధ్యక్షులు తిరుపతిరావు, యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు, వై.శ్యామలరావు, ఆర్‌.సతీష్‌ డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం నగరంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్‌ కార్మికుల 18వ రోజులుగా చేపడుతున్న మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ వర్కర్స్‌ నిరవధిక సమ్మెలో భాగంగా ఆదివారం వంటా–వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలవాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ విభాగం కార్మికులు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లు, డీపీఓ, సెక్యూరిటీ గార్డ్స్‌, పార్క్‌ వర్కర్స్‌, గ్యాంగ్‌ మజ్దూర్‌, వాటర్‌ వర్క్స్‌ వర్కర్స్‌, ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌, అటెండర్స్‌ తదితరులు పాల్గొన్నారు.

అసిరితల్లి సంబరాలకు ముహూర్తం ఖరారు

అరసవల్లి: అరసవల్లి–కాజీపేట గ్రామదేవత అసిరితల్లి అమ్మవారి సిరిమానోత్సవ సంబరాలకు ముహూర్తం ఖరారయ్యింది. వచ్చే ఏడాది వైశాఖ శుద్ధ ద్వాదశి ఏప్రిల్‌ 28న మంగళవారం అమ్మవారి సంబరాల్లో కీలకమైన సిరిమానోత్సవం జరిపేందుకు గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం అసిరితల్లి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన గ్రామపెద్దల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆదిత్యాలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఘనంగా నెల రోజుల పాటు సంబరాలు, సిరిమానోత్సవం జరుగుతాయని చెప్పారు. అనంతరం పలువురు పెద్దలు మాట్లాడుతూ గతంలో తలెత్తిన లోపాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, నిర్వహణ కమిటీల్లో యువతరానికి ప్రాధాన్యమివ్వాలని కోరారు. గ్రామ పెద్దల నిర్ణయంపై అరసవల్లి, కాజీపేట, ఆదిత్యనగర్‌ కాలనీ, కామేశ్వర నగర్‌, లక్ష్మీనగర్‌ వాసులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, శిమ్మ సూర్యనారాయణ, తెలుగు మంగయ్య, ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, ఉంగటి రమణమూర్తి, నక్క రామకృష్ణ, నక్క నారాయణమూర్తి, ఉంగటి పాపారావు, తెలుగు సూర్యనారాయణ, సీర చిన్నారావు, కునుకు గోవింద్‌, రుప్ప అప్పన్న, తెలుగు జగదీష్‌, దుంగ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

దూడకు అరుదైన చికిత్స

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): దూసి గ్రామంలో దుప్పల అప్పారావుకు చెందిన లేగదూడ రెండు కాళ్లు వంకరతో పుట్టడంతో డాక్టర్‌ సుభాష్‌ చంద్రబోస్‌ వైద్యం చేసి సాధారణ స్థితికి తీసుకొచ్చారు. శ్రీకాకుళం నగరంలోని పశువైద్యశాలలో ఆదివారం రెండు, మూడు గంటలు పాటు శ్రమించి ఆపరేషన్‌ చేసి అల్యూమినియం స్ట్రిప్‌తో కట్టు వేసి కాపాడారు. దీంతో రైతు ఆనందం వ్యక్తం చేశారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు స్వస్తి పలకాలి

శ్రీకాకుళం క్రైమ్‌: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో మెలగాలని పోలీసు అధికారులు సూచించారు. జిల్లాలో పలు పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు ఆదివారం కౌన్సిలింగ్‌ ఇచ్చారు. పోలీసుల ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ వద్ద రౌడీ షీటర్లను పిలించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఘర్షణలుకు దూరంగా ఉండాలన్నారు. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దన్నారు. రౌడీషీటర్లపై ఎల్లప్పుడూ పోలీసు నిఘా ఉంటుందన్నారు.

మున్సిపల్‌ ఇంజినీరింగ్‌  కార్మికుల ‘వంటా–వార్పు’   1
1/3

మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికుల ‘వంటా–వార్పు’

మున్సిపల్‌ ఇంజినీరింగ్‌  కార్మికుల ‘వంటా–వార్పు’   2
2/3

మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికుల ‘వంటా–వార్పు’

మున్సిపల్‌ ఇంజినీరింగ్‌  కార్మికుల ‘వంటా–వార్పు’   3
3/3

మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికుల ‘వంటా–వార్పు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement