
సిటిజన్ కమిటీ నూతన కార్యవర్గం
జయపురం: జయపురం సిటిజన్ కమిటీ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం జరిగాయి. సంఘ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షురాలిగా బినోదిని శాంతపాత్రో, సాధారణ కార్యదర్శిగా విష్ణు వర్ధన రెడ్డి, ఉపాధ్యక్షులుగా మదన మోహననాయిక్, దేవేంద్రబాహిణీపతి, భవాణీ శంకర ఆచార్య, సహాయ కార్యదర్శులుగా హరిహర కరసుధా పట్నాయక్, డాక్టర్ నీలాచల ప్రధాన్, జానకీ పాణిగ్రహి, కోశాధికారిగా రబినారాయణ నందో, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సుభాష్ చంధ్ర పండ, కార్యవర్గ సభ్యులుగా సత్యబ్రత పండ, పరమేశ్వర పాత్రో, రత్నాకర చౌధురి, ఇంజనీర్ కేధార్ నాథ్ బెహర, నరశింగ పాణిగ్రహి, గీతా ప్రకాశ్ చంధ్ర మిశ్ర, నరశింగ చౌదురి, జదాబ్ సుబుద్ది, రామ నాయిక్, భీమసేన్ అగర్వాల్, జి.వెంకటేశ్వరరావు, పి.మహేశ్వరరావు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా డాక్టర్ సురేష్ దాస్ వ్యవహరించారు. నూతన కార్యవర్గంతో డాక్టర్ దాస్ ప్రమాణ స్వీకారం చేయించారు.