
కాంగ్రెస్ పార్టీ నాయకుడు మృతి
కొరాపుట్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి. బాలాజీ (57) అనారో గ్యంతో సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ భాహీణి పతి, మున్సిపల్ మాజీ చైర్మన్ మీకాక్షి బాహీనీ పతి, జయపూర్ మున్సిపల్ చైర్మన్ నొరి మహంతి, వైస్ చైర్మన్ బి.సునీత తదితరులు కాాపువీధిలోని ఆయన స్వగృహానికి వచ్చిన బాలాజీ మృతదేహానికి నివాళులర్పి్ంచారు.అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. కాగా బాలాజీ భార్య పి.రామలక్ష్మి 11వ వార్డు కౌన్సిలర్గా వ్యవహరిస్తున్నారు.
పొలాల్లోకి కలుషిత నీరు
కొరాపుట్: కలుషిత నీటితో పంట పొలాలు పాడవుతున్నాయి. కొరాపుట్ జిల్లా కేంద్రం నుంచి సేకరించిన వ్యర్థాలను డంపింగ్ యార్డులో వేస్తున్నారు. కానీ మురుగు నీరు మాత్రం రంగబలి కుంబ చంపాగు సెంటర్ ప్రాంతాల వైపు వెళ్తోంది. ఆ ప్రాంతంలో పొలాల్లో నిల్వ ఉండిపోతోంది. ఈ నీరు వెళ్లే మార్గం మళ్లించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
బొడొనాలో డ్యామ్ సందర్శన
రాయగడ: జిల్లాలోని కెందుగుడ ప్రాంతంలో గల బొడొనాలో డ్యామ్ను జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి సోమవారం సందర్శించారు. అక్కడ గల మత్సకారులతో కాసేపు మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేటకు వెళ్లే మత్సకారులు తీసుకుంటున్న జాగ్రత్త చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. చేపల వేటనే జీవనోపాధిగా బతకు బాటు కొనసాగిస్తున్న మత్సకారులకు అండగా ఉంటామన్నారు. డ్యామ్ నుంచి సేకరించిన చేపలను వీధుల్లో తిరిగి విక్రయించే మహిళలతో కాసేపు ముచ్చటించారు. ప్రభుత్వం మత్సకారులకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సుందర్గఢ్ దుళింగ
బొగ్గు గనిలో ప్రమాదం
భువనేశ్వర్: సుందర్గఢ్ దుళింగ బొగ్గు గనిలో సోమవారం ఉదయం ప్రమాదం సంభవించింది. ఆపరేటర్లకు తీసుకుని వెళ్తున్న బస్సు గనిలో బోల్తా పడింది. బస్సులో 30 మందికి పైగా ఆపరేటర్లు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి పైగా గాయపడ్డారు. చికిత్స కోసం క్షతగాత్రులను బ్రజ్రాజ్నగర్లోని ఆస్పత్రిలో చేర్చారు. మృతుడు పుడాపల్లి నివాసి నిత్యానంద ప్రధాన్గా గుర్తించారు. ఘటనా స్థలంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

కాంగ్రెస్ పార్టీ నాయకుడు మృతి