
భక్తిశ్రద్ధలతో హనుమాన్ మందిర ప్రతిష్ట
జయపురం: జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ సమితి దమణహండిలో శనివారం హనుమాన్ మందిర ప్రతిష్ట ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. మూడు రోజులుగా నిర్వహించిన మందిర ప్రతిష్ట వేడుకల్లో భాగంగా కలశ జాత్ర, గోపూజ, పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 26వ జాతీయ మార్గంలో గల దమణ హండిలో నిర్వహించిన హనుమాన్ మందిర ప్రతిష్ట ఉత్సవాల్లో స్థానికులే కాకుండా సరిహద్దున గల ఛత్తీష్గఢ్ రాష్ట్ర సుకుమ రాజ కుమార్ జయదేవ్, అతని కుమారుడు బిదిత దేవ్, జయపురం రాజమాత సబితా దేవి, కొట్పాడ్ ఎమ్మెల్యే రూసు భోత్ర, కొట్పాడ్ సమితి బీడీఓ బిక్రమ దొర, ఎంపీ ప్రతినిధి రామేశ్వర జెన, కొట్పాడ్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు రంజిత్ కుమార్ పట్నాయక్, కొట్పాడ్ సమితి ఉపాధ్యక్షుడు బాబులి పాణిగ్రహి పాల్గొన్నారు. కొరాపుట్ జిల్లా గ్రామాల నుంచే కాకుండా ఛత్తీష్గఢ్ రాష్ట్ర ప్రజలు, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. తాపస్ కుమార్ పాడీ, సంజీవ కుమార్ బిశాయి, ఉమేష్ చంద్ర బ్రహ్మ, తీర్థబాసి చౌదరి, గౌరవ కుమార్ పర్యవేక్షించారు.

భక్తిశ్రద్ధలతో హనుమాన్ మందిర ప్రతిష్ట