
బస్సు బోల్తా: 25 మందికి గాయాలు
మల్కన్గిరి:
మల్కన్గిరి జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బిజాఘటిలో సోమవారం ఉదయం ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలాజి ట్రావెల్స్కు చెందిన ఓ ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుంచి భవానీపట్నం వెళ్తోంది. బస్సులో 37 మంది ఉన్నారు. బిజాఘటి వద్దకు చేరేసరికి బస్సు అదుపు తప్పి పడిపోయింది. విషయం తెలుసుకున్న మల్కన్గిరి ఐఐసి రీగాన్కీండో తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సబ్ కలేక్టర్ దుర్యోధన్ బోయి ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.

బస్సు బోల్తా: 25 మందికి గాయాలు