విశ్వనాథ సాహిత్యం అజరామరం | - | Sakshi
Sakshi News home page

విశ్వనాథ సాహిత్యం అజరామరం

Sep 11 2025 6:36 AM | Updated on Sep 11 2025 6:36 AM

విశ్వనాథ సాహిత్యం అజరామరం

విశ్వనాథ సాహిత్యం అజరామరం

విశ్వనాథ సాహిత్యం అజరామరం

విజయవాడ కల్చరల్‌: విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం అజరామరమని వేముల చారిటబుల్‌ సంస్థ వ్యవస్థాపకుడు వేముల హజరత్తయ్య గుప్తా అన్నారు. కవి సామ్రాట్‌ విశ్వనాథ 131వ జయంతి సందర్భంగా గాంధీనగర్‌లోని సంస్థ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. గుప్తా మాట్లాడుతూ ప్రభుత్వం విశ్వనాథ పేరుతో ఏటా సాహితీ సదస్సులు నిర్వహించాలని సూచించారు. వేముల చారిటీస్‌ కన్వీనర్‌ ఎంవీ చలమయ్య, వాయిద్య కళాకారులు పాల్గొన్నారు.

● సంస్కార భారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో విశ్వనాథమార్గ్‌లోని విశ్వనాథ సత్యనారాయణ విగ్రహంవద్ద జయంతి వేడుకలను నిర్వహించారు. విశ్వనాథ శిష్యుడు డాక్టర్‌ శతావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌, సంస్కారభారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పీవీఎన్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

● బీజేపీ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో విశ్వనాథమార్గ్‌లోని విశ్వనాథ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఆ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం ఆధ్వర్యంలో పుష్పాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వనాథ సత్యనారాయణ మనుమడు విశ్వనాథ సత్యనారాయణను ఘనంగా సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement