పాలిసెట్‌ ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌ ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన

Jun 28 2025 5:27 AM | Updated on Jun 28 2025 8:57 AM

పాలిసెట్‌ ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన

పాలిసెట్‌ ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన

మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిసెట్‌–2025 పరీక్షలో ర్యాంకులు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం కొనసాగింది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో స్పెషల్‌ కేటగిరి అభ్యర్థులు 148, మాచవరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కేంద్రంలో 213 మంది, ఆంధ్ర లయోలా డిగ్రీ కళాశాల ఆవరణలో 170 మంది జనరల్‌ కేటగిరి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తైంది. 531 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను శుక్రవారం పరిశీలించి వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశామని పాలిసెట్‌–2025 ఎన్టీఆర్‌ జిల్లా కో–ఆర్టినేటర్‌ ఎం.విజయసారథి చెప్పారు.

నేటి షెడ్యూల్‌

శనివారం ఉదయం 9 గంటల నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలోని కేంద్రంలో స్పెషల్‌ కేటగిరి అభ్యర్థులు ఆంగ్లో ఇండియన్స్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మొదటి నుంచి చివరి ర్యాంకు వరకు, ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ కళాశాలలోని కేంద్రంలో 120001 నుంచి 127000 లోపు ర్యాంకు వరకు, లయోలా కళాశాల ఆవరణలోని కేంద్రంలో 127001 నుంచి చివరి ర్యాంకు పొందిన జనరల్‌ కేటగిరి విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని విజయసారథి చెప్పారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకుని ధ్రువీకరణ పత్రం పొందిన అభ్యర్థులు ఈ నెల 30వ తేది సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో వెబ్‌ ఆప్షన్స్‌ ఎంపిక చేసుకోవచ్చునని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement