ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ ఏవై రావు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ ఏవై రావు

Jun 9 2025 10:22 AM | Updated on Jun 9 2025 10:22 AM

ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్

ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు అడిషనల్‌ డైరెక్టర్‌ హోదాలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఆలపాటి ఏడుకొండలరావు(ఏవై రావు) విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల(ఎస్‌ఎంసీ) ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ అశోక్‌కుమార్‌ ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆదివారం జీవో నంబర్‌ 359 విడుదల చేశారు. బదిలీ అయిన డాక్టర్‌ అశోక్‌కుమార్‌ గతేడాది అక్టోబరులో ఎస్‌ఎంసీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన దాదాపు తొమ్మిది నెలల పాటు ఇక్కడ విధులు నిర్వహించారు.

1986–92లో ఇక్కడే ఎంబీబీఎస్‌ పూర్తి

సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులైన డాక్టర్‌ ఆలపాటి ఏడుకొండలరావు ఇదే కళాశాలలో 1986–1992 బ్యాచ్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. అనంతరం 1997లో ఉస్మానియా కళాశాలలో రేడియేషన్‌ అంకాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశారు. 2023 జూలైలో అడిషనల్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది ఒంగోలు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ప్రిన్సిపాల్‌తో పాటు, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చదువుకున్న కళాశాలకు ఇప్పుడు ప్రిన్సిపాల్‌గా రావడం సంతోషంగా ఉందని, కాలేజీ అభివృద్ధికి కృషి చేస్తానని డాక్టర్‌ ఏడుకొండలరావు అన్నారు.

చదువుకున్న కాలేజీకి ప్రిన్సిపాల్‌గా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement