ముఖ్య గమనిక! హంగేరీ వచ్చే వాళ్లు ముందుగా ఈ వివరాలు ఇవ్వండి | Give Your Full details Before you Reached Hungary Boarder Said By Indian Embassy | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు అలెర్ట్‌.. హంగేరీ బోర్డర్‌ చేరే ముందు ఈ ఫామ్‌ నింపండి

Feb 25 2022 3:18 PM | Updated on Feb 25 2022 3:40 PM

Give Your Full details Before you Reached Hungary Boarder Said By Indian Embassy - Sakshi

ఉక్రెయిన్‌లో యుద్ధ సమయంలో చిక్కుకుపోయిన భారతీయులను రోమేనియా, హంగేరీల మీదుగా ఇండియాకి తీసుకువచ్చేందుకు కేంద్రం వ్యూహం రచించింది. ఈ మేరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ హంగేరీ, రోమేనియా సరిహద్దులకు చేరుకోవాలంటూ భారతీయులకు సూచనలు జారీ చేసింది. 

భారత ఎంబసీ నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు కేపీపీ టైసా సరిహద్దు వద్ద హంగేరిలోకి వెళ్లేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఇలా వచ్చే వారి కోసం హంగేరీలో ఉన్న ఇండియన్‌ ఎంబసీ కొన్ని విధి విధానాలు రూపొందించింది. అందులో భాగంగా కేపీపీ టైసా సరిహద్దుకు చేరుకోవాడనికి ముందే ఆన్‌లైన్‌లో కొన్ని పత్రాలు ఫిల్‌ చేయాలంటూ కోరింది.

ఉక్రెయిన్‌ నుంచి హంగేరీ వచ్చే భారతీయులు ముందుగా పేరు, జెండర్‌, పుట్టినరోజు, ఉక్రెయిన్‌లో కాంటాక్ట్‌ నంబర్‌, భారత్‌లో కాంటాక్ట్‌ నంబర్‌, ఇండియాలో అడ్రస్‌, ఈ మెయిల్‌, పాస్‌పోర్ట్‌ నంబరు, పాస్‌పోర్ట్‌ ఎక్స్‌పైరీ తేది, ఉక్రెయిన్‌లో అడ్రస్‌, దగ్గరగా ఉన్న హంగేరి సరిహద్దు తదితర వివరాలు పొందు పరచాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్య గమనికగా హాంగేరీ లోని ఇండియన్‌ ఎంబసీ పేర్కొంది.


చదవండి: హంగేరి, రుమేనియా బోర్డర్‌కి రండి - కేంద్రం కీలక ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement