భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యం వద్దు

Oct 29 2025 7:27 AM | Updated on Oct 29 2025 7:27 AM

భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యం వద్దు

భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యం వద్దు

వెంటవెంటనే అర్జీలను పరిష్కరించాలి

కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యం చేయవద్దని, వెంటవెంటనే అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి ఆదేశించారు. డిచ్‌పల్లి తహసీల్‌ కార్యాలయాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్‌ సతీష్‌రెడ్డి, ఇతర సిబ్బందితో భూభారతి అమలుపై సమీక్ష జరిపారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశించారు. దరఖాస్తులు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదాబైనామా, పీఓటీల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, వెంటవెంటనే నోటీసులు జారీ చేస్తూ, క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ సందీప్‌, ఆర్డీవో రాజేంద్ర కుమార్‌, తహసీల్దార్‌ సతీష్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఆర్‌ఐ సంతోష్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement