
భారీ యంత్రాలు పసుపు రైతులకు భారమే..
● కొనుగోలుకు సబ్సిడీ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
● యంత్రాల కొనుగోలుకు
ఆసక్తి చూపని పసుపు రైతులు
● సుమారు 20 మందికే పరిమితమైన
భారీ యంత్రాలు
ఇతర రైతులకు ఇస్తున్నా
రూ.లక్షలు వెచ్చించి పసుపు సాగుకోసం అవసరమయ్యే యంత్రాలను కొనుగోలు చేశా. గ్రామానికి చెందిన వారితోపాటు ఇతర గ్రామాల రైతులకు యంత్రాలను ఇస్తున్నా. పెట్టుబడి వ్యయం తగ్గి వారు లాభపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అందించి యంత్రాలను రైతులకు చేరువ చేయాలి.
– నలిమెల చిన్నారెడ్డి, రైతు, మగ్గిడి, ఆర్మూర్ మండలం
ఆర్మూర్: వ్యవసాయ యాంత్రీకరణకు 2025–26లో రూ.104 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల ప్రకటించారు. రైతులకు ఉపయోగకరమైన, డి మాండ్ ఉన్న పరికరాలను గుర్తించి సబ్సిడీపై రైతులకు అందించాలని మంత్రి అధికారులకు సూచించారు. అయితే పసుపు సాగుకు అవసరమైన భారీ యంత్రాలకు సబ్సిడీ వర్తింపజేయకపోవడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. తమకు అవసరమైన యంత్రాలపై సబ్సిడీ ఇవ్వడం లేదని పసుపు రైతు లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వేలాది మంది రైతులు సుమారు 25 వేల హెక్టార్లలో పసుపు సాగు చేస్తున్నారు. కానీ యంత్రాల సాయంతో సాగు చేస్తున్న వారి సంఖ్య మాత్రం 20కి మించ లేదు. యంత్రాలను కొనుగో లు చేసిన రైతులు వ్యవసాయ కూలీల ఖర్చులను తగ్గించుకుంటున్నారు. యంత్రాల సాయంతో పసుపు సాగు పను లు చేస్తున్న రైతులకు ఎకరాకు సుమారు రూ.లక్షల వరకు ఖర్చవుతుండగా, యంత్రాలు లేని రైతులకు రూ.లక్షా యాభైవేల వరకు అవుతోంది. యంత్రాల కొనుగోలుకు ల క్షల రూపాయలు అవసరం కావడమే అందుకు కారణం. సీజనల్ వారీగా అవసరం ఉన్న పరికరాలను పెద్ద రైతుల నుంచి అద్దెకు తెచ్చుకుని పని పూర్తి చేసుకుంటున్నారు.
సబ్సిడీ ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తూ పసుపు సాగుకు ఉపయోగించే యంత్రాలన్నింటికి సబ్సిడీ ఇవ్వాలి. దీంతో సన్న, చిన్నకారు రైతులు సైతం యంత్రాలను కొనుగోలు చేసి ఉపయోగించడం ద్వారా పెట్టుబడి వ్యయం తగ్గి ఆర్థికంగా లాభపడతారు. పసుపు రైతులపై ప్రభుత్వం దృష్టి సారిస్తే పంట సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
– పెద్దకాపు రాజు, రైతు, పెర్కిట్, ఆర్మూర్ పట్టణం

భారీ యంత్రాలు పసుపు రైతులకు భారమే..

భారీ యంత్రాలు పసుపు రైతులకు భారమే..

భారీ యంత్రాలు పసుపు రైతులకు భారమే..