
డ్రైపోర్టుకు అన్నివిధాలుగా అనుకూలం
డ్రైపోర్టు ఏర్పాటుకు ని జామాబాద్ జిల్లా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వ్యవసాయ ఆధారిత జిల్లాలో తగినవిధంగా పరిశ్రమలు లేకపోవడంతో రైతులు పండించిన పంటలకు ఆశించిన ధరలు దక్కడం లేదు. గతంలో జిల్లాలో 85 వేల ఎకరాల్లో పసుపు, 45 వేల ఎకరాల్లో చెరుకు సాగయ్యేది. తగిన మార్కెటింగ్ వ్యవస్థ, ఎగుమతులకు అవసరమైన సదుపాయాలు లేకపోవడంతో పసుపు సాగు తగ్గిపోగా, చెరుకు సాగు లేకుండా పోయింది. అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి. నాణ్యమైన పంటలు పండించే రైతులున్న జిల్లాలో డ్రైపోర్టు అత్యవసరం. జిల్లా కేంద్రంగా చుట్టుపక్కల జిల్లాల నుంచి పంట, ఇతర ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవచ్చు. జిల్లాకు రావాల్సిన ఎయిర్పోర్టు, రైల్వే ప్రాజెక్టు, పెద్ద పరిశ్రమలు కలగానే ఉన్నాయి. వీటిని సాధించడంలో నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇప్పుడు కనీసం డ్రై పోర్టు ఏర్పాటు చేసినా జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. రవాణా సౌకర్యానికి అనుకూలంగా ఉన్న హైవే పక్కన డ్రైపోర్టు పెడితే బాగుంటుంది. పంట ఉత్పత్తులు నిల్వ చేసుకుని మంచి ధర వచ్చినప్పుడు ఎగుమతి చేసుకోవచ్చు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. డ్రైపోర్టు కోసం గతంలో కేటీఆర్, హరీశ్రావు, ప్రశాంత్రెడ్డిలను కలిసి వివరించినా ఫలితం లేదు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెద్దాం. సంకల్ప బలంతో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి. డ్రైపోర్టు ఏ ఒక్కరి కోసమో కాదు, ముందు తరాల భవిష్యత్తు కోసం.
– నల్ల దినేశ్రెడ్డి,
చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు