
ఉత్సాహంగా రైతు సంబురం
డిచ్పల్లి: రైతు విజయోత్సవ కార్యక్రమం జిల్లాలో ఉత్సాహభరిత వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించారు. వానాకాలం–2025 సీజన్కు సంబంధించి ముందస్తు పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా మంగళవారం రైతు సంబురాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల వద్దకు అన్నదాతలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. రైతు భరోసా నిధులు తొమ్మిది రోజుల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రైతు వేదికలో వీడియో కా న్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. డిచ్పల్లి మండలం యా నంపల్లి రైతు వేదిక లో ఆదర్శ రైతులతో కలిసి కలె క్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సీఎం ప్రసంగాన్ని తిలకించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి, తహసీల్దార్ సతీశ్రెడ్డి, మండల వ్యవసాయ అధికారిణి సుధామాధురి, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొల సాని శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ రాంచందర్గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.