అందుబాటులో ఎరువులు, విత్తనాలు | - | Sakshi
Sakshi News home page

అందుబాటులో ఎరువులు, విత్తనాలు

Jun 25 2025 1:33 AM | Updated on Jun 25 2025 1:33 AM

అందుబాటులో ఎరువులు, విత్తనాలు

అందుబాటులో ఎరువులు, విత్తనాలు

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్‌ టి వినయ్‌ కృష్ణారెడ్డి తెలిపారు. జూన్‌, జూలై నెలలకు సరిపడా నిల్వలున్నా యని, ఎక్కడా రైతులకు కొరత లేకుండా అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ఎరువులు, విత్తన విక్రయ కేంద్రమైన గ్రోమోర్‌ సెంటర్‌తోపాటు డిచ్‌పల్లి సహకార సొసైటీ గోదాము (యానంపల్లి)ను కలెక్టర్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్‌ రిజిస్టర్‌, ఇన్వాయిస్‌, బిల్‌బుక్‌లను, విత్తన బస్తాలపై లాట్‌ నంబర్‌, ఎమార్పీ ధర, బ్యాచ్‌ నంబర్‌, గడువు తేదీ తదితర వివరాలను పరిశీలించారు. స్టాక్‌ రిజిస్టర్‌, ఈ–పాస్‌ నమోదు వివరాల్లో తేడా ఉండొద్దని కేంద్రం నిర్వా హకులకు సూచించారు. ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి, డిచ్‌పల్లి తహసీల్దార్‌ సతీశ్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారిణి సుధామాధురి, సొసైటీ చైర్మన్‌ రాంచందర్‌గౌడ్‌, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్‌, సొసైటీ సీఈవో ఒస సాయిలు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement