ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

Jun 24 2025 4:19 AM | Updated on Jun 24 2025 4:19 AM

ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

నిజామాబాద్‌ అర్బన్‌: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ టీ వినయ్‌ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 217 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌, ట్రెయినీ కలెక్టర్‌ కరోలిన్‌ చింగ్తియాన్‌ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్‌, ఇన్‌చార్జి డీపీవో శ్రీనివాస్‌, మెప్మా పీడీ రాజేందర్‌లకు అర్జీలు సమర్పించారు.

బాధితులకు త్వరగా పరిహారం చెల్లించాలి

పోక్సో చట్టం కింద కేసులు నమోదు అయిన అనంతరం దాని బాధితులకు త్వరగా పరిహారం చెల్లించాలని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం పోక్సో చట్టం, అట్రాసిటీ బాధితుల పరిహారం, మహిళలు, బాలికలపై జరిగిన దారుణాలకు సంబంధించి పరిహారం చెల్లింపుపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బాధితులకు పరిహారం చెల్లింపుల్లో నిర్లక్ష్యం చేయ వద్దని సంక్షేమ అధికారిణి, మహిళా శిశు సంక్షేమ అధికారికి ఆదేశించారు. అర్హత కలిగిన 86 కేసులను జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఆమోదించింది. సీ పీ సాయిచైతన్య, ప్రాజెక్టు డైరెక్టర్‌, డీఆర్డీవో సాయా గౌడ్‌ , డీఎంహెచ్‌వో రాజశ్రీ, డీఈవో అశోక్‌, జిలా సంక్షేమ అధికారిణి ఎస్‌కే రసూల్‌ బీ, ఏజీవో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య పాల్గొన్నారు.

అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి

కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement