
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
బోధన్: నవీపేట మండల కేంద్ర శివారులోని బాసర–నిజామాబాద్ ప్రధాన రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందింది. స్థానికులు, కుటుంబసభ్యుల తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నవీపేట మండలంలోని బినోలా గ్రామానికి చెందిన బైండ్ల గంగాధర్ కొన్నేళ్లుగా మండల కేంద్రంలో ఫర్టిలైజర్ షాప్ నిర్వహిస్తూ ఇక్కడే నివాసం ఉంటున్నారు. గంగాధర్కు ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు బైండ్ల తేజశ్విని (16) ఇటీవల పదో తరగతి పూర్తి చేయగా, ఇంటర్ కోసం నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేర్పించారు. కళాశాల హాస్టల్కు వెళ్లేందుకు సోమవారం సాయంత్రం గంగాధర్ కూతురు తేజశ్వినితో కలిసి బైక్పై ఇంటి నుంచి బయల్దేరారు. మండల కేంద్ర శివారులో బాసర వైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ.. బైక్ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ కిందపడిపోగా తీవ్రగాయాలైన తేజశ్విని అక్కడిక్కడే మృతి చెందింది. కళ్ల ముందే కూతురు మరణించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గంగాధర్ ఫిర్యాదు మేరకు నవీపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి