
కలెక్టర్ను కలిసిన ట్రెయినీ కలెక్టర్
నిజామాబాద్అర్బన్: జిల్లాకు ట్రెయినీ కలెక్టర్గా వచ్చిన 2024 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి కరోలిన్ చింగ్తియాన్ మావీ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. గత ఏప్రిల్ నెలలో ట్రెయినీ కలెక్టర్గా నిజామాబాద్ జిల్లాకు కేటాయించబడిన కరోలిన్ చింగ్తియాన్ మావీ, నెలన్నరపాటు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమ వారం జిల్లాకు తిరిగి వచ్చిన సందర్భంగా ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ను మర్యా ద పూర్వకంగా కలిశారు.