ఓపెన్‌ నేషనల్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌కు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ నేషనల్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌కు ఎంపిక

Jun 24 2025 4:15 AM | Updated on Jun 24 2025 4:15 AM

ఓపెన్

ఓపెన్‌ నేషనల్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌కు ఎంపిక

నిజామాబాద్‌నాగారం: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో నిర్వహించనున్న ఓపెన్‌ నేషనల్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌కు నిజామాబాద్‌ అమేచూర్‌ తైక్వాండోకు చెందిన క్రీడాకారులు ఎంపికయ్యారు. ఎంపికై న క్రీడాకారులను అసోసియేషన్‌ కార్యదర్శి మనోజ్‌ కుమార్‌, ప్రెసిడెన్సీ హై స్కూల్‌ ప్రిన్సిపల్‌ పవన్‌ కుమార్‌ సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. పిల్లలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు.

తల్లి చేపల వేట షురూ

తొలి రోజు 4 క్వింటాళ్ల వేట రెండు టన్నుల తల్లి చేపలు అవసరం

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ దిగువన ఉన్న జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో చేప పిల్లలను ఉత్పత్తి చేసేందుకు అవసరమైన తల్లి చేపల వేట ఎట్టకేలకు ప్రారంభమైంది. జిల్లాలోని కొన్ని గ్రామాల చెరువులను తల్లి చేపల వేట కోసం అధికారులు ఎంపిక చేశారు. సోమవారం ఇందల్‌వాయి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో వేట ను ప్రారంభించారు. తొలిరోజు నాలుగు క్వింటాళ్ల చేపలను సేకరించినట్లు మత్స్య అభివృద్ధి అధికారి దామోదర్‌ తెలిపారు. తల్లి చేపలను జాతీయ చేప పిల్లల కేంద్రానికి తరలించి మట్టి పాండ్లలో నిల్వ ఉంచుతారు. అనంతరం గుడ్లను సేకరించి హేచరీల్లో వేసి చేపపిల్లల ఉత్పత్తి చేపడుతారు. ఈ ప్రక్రియ అంతా జూలై నెలలో ప్రారంభమవుతుంది. అయితే ముందుగా తల్లి చేపల సేకరణ పూర్తి కావాల్సి ఉంటుంది. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో 5 కోట్ల చేపపిల్లల ఉత్పత్తి చేసేందుకు 2 టన్నుల తల్లి చేపలు అవసరం ఉంటుందని మత్స్య అభివృద్ధి అధికారులు తెలుపుతున్నారు. తల్లి చేపల సేకరణ ప్రారంభం కావడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తల్లి చేపల సేకరణను మత్స్యశాఖ ఏడీ ఆంజనేయులు పరిశీలించారు.

ఓపెన్‌ నేషనల్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌కు ఎంపిక1
1/1

ఓపెన్‌ నేషనల్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌కు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement