
ఎస్ఆర్ విద్యార్థుల ప్రతిభ..
నిజామాబాద్ అర్బన్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు డీజీఎం గోవర్ధన్ రెడ్డి తెలిపారు. దేవావత్ వరుణ్ ఆలిండియా 1,715 ర్యాంకు, నవీన్ కుమార్ 1,779, టీ ఆకాశ్ 1,882, ఎం.అజయ్ కుమార్ 1,895, రాము 2,351, జీ నవతేజ్ 2,423, బీ రవితేజ 2,780, ఎం. శ్రీ రిత్విక్ 5,584 ర్యాంకు సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను డీజీఎం గోవర్ధన్ రెడ్డి, జోనల్ ఇన్చార్జి శ్రీకాంత్ అభినందించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, కరిక్యులం, మెటీరియల్స్, నిరంతరం నిర్వహించే పరీక్షలతో తమ విద్యార్థులు జాతీయస్థాయి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు.
వెక్టర్ కళాశాల విద్యార్థికి 1520 ర్యాంకు
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో నగరంలోని విక్టర్ కళాశాలకు చెందిన నిశాంత్ రెడ్డి ఆలిండియా 1520 ర్యాంకు, వినాయక జోషి 3,850 ర్యాంకు సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ మధుసూదన్ జోషి అభినందించారు.

ఎస్ఆర్ విద్యార్థుల ప్రతిభ..

ఎస్ఆర్ విద్యార్థుల ప్రతిభ..