అంబరాన్నంటిన అవతరణ సంబరాలు | - | Sakshi
Sakshi News home page

అంబరాన్నంటిన అవతరణ సంబరాలు

Jun 3 2025 5:47 AM | Updated on Jun 3 2025 5:49 AM

నిజామాబాద్‌అర్బన్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీ కరించారు. కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, సీపీ సాయి చైతన్య, డీసీసీబీ చైర్మన్‌ రమేశ్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌కుమార్‌, డీఎఫ్‌వో వికాస్‌ మీనా, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌, ఆయా శాఖల అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. బాలభవన్‌, డ్యాన్స్‌ అకాడమీలకు చెందిన కళాకారులు ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బాలభవన్‌ చిన్నారులు ‘తల్లి భారతి వందనం’ గీతంపై నృత్య ప్రదర్శనతోపాటు ఆత్మ రక్షణ ఆవశ్యకతను చాటుతూ కర్రసాము విద్యను ప్రదర్శించారు. అనిల్‌ ఈరవత్రి, కలెక్టర్‌, సీ,పీ, ఇతర అధికారులు కళాకారుల వద్దకు వెళ్లి వారిని అభినందించి జ్ఞాపికలు బహూకరించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. పలుశాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తూ నిరంతర నిఘా కోసం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ప్రవేశపెట్టిన డ్రోన్‌ వ్యవస్థను పరిచయం చేస్తూ ప్రయోగాత్మకంగా పనితీరును ప్రదర్శించారు. ముఖ్య అతిథి అనిల్‌తో కలిసి కలెక్టర్‌, ఆయా శాఖల ఉన్నతాధికారులు స్టాళ్లను సందర్శించారు. రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు.

తెలంగాణ అమరవీరులకు నివాళులు

జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌లో ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ అనిల్‌ ఈరవత్రి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ తదితరులు నివాళులు అర్పించారు.

పరేడ్‌ మైదానంలో అలరించిన

సాంస్కృతిక ప్రదర్శనలు

అంబరాన్నంటిన అవతరణ సంబరాలు1
1/1

అంబరాన్నంటిన అవతరణ సంబరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement