
రెడ్క్రాస్ సేవలు అభినందనీయం
నిజామాబాద్అర్బన్: ప్రజలకు సేవలందించడంలో రెడ్క్రాస్ ముందుంటుందని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అభినందించారు. జాతీయ స్థాయిలో రెడ్క్రాస్ అవార్డు అందుకున్న రాష్ట్ర కార్యవర్గసభ్యుడు తోట రాజశేఖర్ను సోమవారం కలెక్టర్ ప్రత్యేకంగా సత్కరించారు. రాజశేఖర్ చాలా ఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుండడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెడ్క్రాస్ ఆధ్వర్యంలో రూపొందించిన వడదెబ్బ నివారణ సూచనల పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ప్రజలకు అత్యవసర సమయాల్లో రక్తదానం చేస్తూ సేవలు అందించడంపై ప్రశంసించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ఇన్చార్జి ఆర్డీవో స్రవంతి, డీపీవో శ్రీనివాస్ రావు, డీఎంహెచ్వో రాజశ్రీ, టీఎన్జీవోస్ అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి శేఖర్, రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, కోశాధికారి కరిపే రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు