
డాక్టరేట్ సాధించిన రాంప్రసాద్
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో పరిశోధక విద్యార్థి కొంగల రాంప్రసాద్ పీహెచ్డీ డాక్టరేట్ సాధించారు. అసోసియేట్ ప్రొఫెసర్ రాజేశ్వరి పర్యవేక్షణలో ‘టాలెంట్ అక్వేషన్స్ అండ్ టాలెంట్ మేనేజ్మెంట్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ –ఏ సెలెక్ట్ స్టడీ’ అనే అంశంపై రాంప్రసాద్ పరిశోధన జరిపి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. శుక్రవారం జరిగిన బహిరంగ మౌఖిక పరీక్షకు బెంగుళూరు సిటీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ముని నారాయణప్ప ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా వ్యవహరించారు.