
భరతనాట్యంలో జిల్లా విద్యార్థినుల ప్రతిభ
నిజామాబాద్ రూరల్: తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో జల్లా కేంద్రానికి చెందిన సిద్ధార్థ కళాక్షేత్రానికి చెందిన జయలక్ష్మి ఆధ్వర్యంలో 27 మంది విద్యార్థినులు భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు. ఆషాఢ మాసం పుర్కసరించుకొని కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. జల్లా కేంద్రంలోని తేనె సాయిబాబా ఆలయంలో ప్రతి ఆదివారం కూచిపూడి, భరతనాట్యం క్లాసులు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీలు ముగించుకొని విద్యార్థినులు ఆదివారం జిల్లాకు చేరుకోనున్నట్లు పేర్కొన్నారు.