
స్కూటీ, బైక్ ఢీ..
● నలుగురికి తీవ్ర గాయాలు
కామారెడ్డి క్రైం: ఎదురెదురుగా వచ్చిన స్కూటీ, బైక్లు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ మూడో ప్లాట్ఫామ్ రోడ్డుపై శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎక్కువగా గూడ్స్ రైళ్లు నిలిచే మూడో నెంబరు ప్లాట్ఫాం వెంబడి కోర్టు రోడ్డు నుంచి అశోక్నగర్ వరకు వాహనాల రాకపోకలకు వీలుగా రోడ్డును నిర్మించారు. కొంతకాలంగా ఈ రోడ్డు గుండా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ఇదే దారిపై శుక్రవారం రాత్రి ఎదురెదురుగా వేగంగా వచ్చిన స్కూటీ, బైక్లు ఢీకొన్నాయి. రెండు వాహనాలపై ప్రయాణిస్తున్న నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వారిని వెంటనే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని పట్టణంలోని అశోక్నగర్ కాలనీకి చెందిన శ్రీధర్, మురారి, బొంతల లెనిన్, లోకేశ్గా గుర్తించారు. వారిలో లెనిన్, లోకేశ్లు మైనర్లుగా తెలుస్తోంది. శ్రీధర్, మురారిల కుటుంబాలు ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చి మేసీ్త్ర పనులు చేసుకుంటున్నాయి. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు రిఫర్ చేశారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్కూటీ, బైక్ ఢీ..