కడుపునొప్పి భరించలేక ఒకరి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కడుపునొప్పి భరించలేక ఒకరి ఆత్మహత్య

Jun 29 2025 3:07 AM | Updated on Jun 29 2025 3:07 AM

కడుపునొప్పి భరించలేక ఒకరి ఆత్మహత్య

కడుపునొప్పి భరించలేక ఒకరి ఆత్మహత్య

మద్నూర్‌(జుక్కల్‌): డోంగ్లీ మండలం లింబూర్‌ గ్రామానికి చెందిన కిస్వే సంజయ్‌(45) శనివారం కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై విజయ్‌కొండ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. లింబూర్‌కు చెందిన సంజయ్‌ మహారాష్ట్రలోని పుణె నగరంలో కుటుంబసభ్యులతో కలిసి కూలీ పని చేసేవాడు. గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న సంజయ్‌.. చికిత్స కోసం చాలా ఆస్పత్రులు తిరిగినా నయం కాలేదని కుటుంబసభ్యులు చెప్పారు. దీంతో 15 రోజుల క్రితం సొంతూరికి వచ్చి కూలీ పని చేసుకుంటున్నాడు.

కడుపునొప్పి తీవ్రం కావడంతో శనివారం లింబూర్‌ శివారులో రోడ్డు పక్కన చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

జీవితంపై విరక్తితో రైలుకు ఎదురెళ్లి ..

ఖలీల్‌వాడి: జీవితంపై విరక్తితో ఓ యువకుడు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. రైల్వే ఎస్సై చెప్పిన ప్రకారం.. నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన జాదవ్‌ శివతేజ(19) శనివారం ఉదయం 8.50 గంటల సమయంలో జీవితంపై విరక్తి చెంది రైలుకు అడ్డుగా వెళ్లి బలవన్మరణం చెందాడు. నిజామాబాద్‌ స్టేషన్‌ మేనేజర్‌ చందన్‌ కుమార్‌ సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని సందర్శించి, మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. మృతుడు నగరంలోని తిలక్‌గార్డెన్‌ వద్ద ఉన్న కమర్షియల్‌ కాంప్లెక్స్‌లోని అశోక్‌ టీ పాయింట్‌లో పని చేసేవాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement