ఐక్యత కోసమే ఏక్తా రన్‌ | - | Sakshi
Sakshi News home page

ఐక్యత కోసమే ఏక్తా రన్‌

Nov 1 2025 8:22 AM | Updated on Nov 1 2025 8:22 AM

ఐక్యత కోసమే ఏక్తా రన్‌

ఐక్యత కోసమే ఏక్తా రన్‌

● ఎస్పీ జానకీషర్మిల

నిర్మల్‌ టౌన్‌: దేశ సమైక్యత, సోదరభావానికి తనదైన మార్గాన్ని చూపిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి పురస్కరించుకుని జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శుక్రవారం ‘ఏక్తా దివస్‌’ నిర్వహించారు. ఇందులో భాగంగా 2 కిలోమీటర్ల ఏక్తా రన్‌ నిర్వహించారు. ఎస్పీ జానకీషర్మిల ఈ రన్‌ను ప్రారంభించి మాట్లాడారు. అందరూ ఐక్యత, పరస్పర గౌరవం కలిగి ఉండాలన్నారు. పటేల్‌ సేవలను, త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడిస్తే నిజమైన జాతీ య ఐక్యత సాధ్యమవుతుందని తెలిపారు. ‘ఏక్తా దివస్‌’ ద్వారా ప్రజల్లో ఐక్యతా భావం, సామరస్య ఉద్దేశం కల్పించడమే ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. కార్యక్రమంలో నిర్మల్‌ ఏఎస్పీ రాజేశ్‌మీనా, పట్టణ సీఐ ప్రవీణ్‌ కుమార్‌, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement