సర్కారు బడుల్లో 5.0 | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడుల్లో 5.0

Oct 31 2025 8:06 AM | Updated on Oct 31 2025 8:06 AM

సర్కారు బడుల్లో 5.0

సర్కారు బడుల్లో 5.0

● ఆధునీకరణ దిశగా అడుగులు ● శుభ్రత, సురక్షితమైన విద్యకు ప్రాధాన్యం ● మండల విద్యా అధికారులు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు పాఠశాలలను సందర్శించి శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి నివేదిక ఇవ్వాలి. ● ప్రమాదకరమైన భవనాలు గుర్తించిన వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాలతో వాటిని తొలగించే చర్యలు తీసుకోవాలి. ● పాత బెంచీల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి, క్లాస్‌రూమ్‌ ఫర్నిచర్‌ను సక్రమంగా అమర్చాలి. ● వేడుకలు, అవగాహన కార్యక్రమాల సమయంలో విద్యుత్‌ సదుపాయాల భద్రత కోసం పాత వైరింగ్‌, స్విచ్‌లను తొలగించి కొత్త పరికరాలు అమర్చాలి. ● భోజనశాలకు సంబంధించిన భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి. విద్యార్థుల ప్రవేశం నిషేధించాలి. ● వంటగ్యాస్‌ సిలిండర్లను తరచుగా తనిఖీ చేసి లీకేజీలను నివారించాలి. ● మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు చేతులు కడుక్కోవడంపై అవగాహన కల్పించాలి. ● గోడలపై ఆరోగ్య సూచనలు, అత్యవసర సేవల నంబర్లు రాయించాలి. ● తరగతి గదులు, ప్రయోగశాలలు, ఆఫీస్‌ గదులు, పాఠశాల ఆవరణ పూర్తిగా శుభ్రపరచాలి. ● మూత్రశాలలు, తాగునీటి ట్యాంకులను బ్లీచింగ్‌ పౌడర్‌తో శుభ్రపరచాలి. ● వైర్లు, స్విచ్‌లు, ఫ్లగ్‌లు దెబ్బతిని ఉంటే వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్తవి అమర్చే విధంగా చూడాలి

లక్ష్మణచాంద/మామడ: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సమయానికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫాంలు అందజేయడంతోపాటు, ఇప్పుడు విద్యాశాఖ ‘‘స్కూల్‌ 5.0 కార్యక్రమం’’ను ప్రారంభించింది.

ప్రధాన ఉద్దేశం..

ప్రతీ ప్రభుత్వ పాఠశాలను అందంగా, పరిశుభ్రంగా, సురక్షితంగా మార్చడం ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యం. విద్యార్థులకు ఆకర్షణీయమైన పాఠశాల వాతావరణం కల్పించడం ద్వారా విద్యా నాణ్యత పెంచడమే ప్రధాన ఆశయం అని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమం విజయానికి ఉపాధ్యాయులు, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, దాతలు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఇందులో భాగస్వాములు అవుతారు. సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

అమలు ఇలా..

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 5 వరకు నిర్వహించనున్నారు. ఈ కాలంలో పాఠశాల భవనాల పరిశీలన నుంచి శానిటేషన్‌ వరకు పలు కార్యాచరణలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పాఠశాలలు విద్యా కేంద్రాలుగా మాత్రమే కాకుండా భద్రతా ప్రమాణాలకు ఆదర్శంగా నిలవాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. పాఠశాల వాతావరణం మారితేనే విద్యార్థుల హాజరు, నేర్చుకునే ఆసక్తి, ఫలితాలు మెరుగుపడతాయని అధికారులు అభిప్రాయపడ్డారు.

అమలు చేయాల్సిన కార్యక్రమాలు..

పకడ్బందీగా అమలు

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో 5.0 కార్యక్రమంను పకడ్బందీగా అమలు చేస్తాం. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. – భోజన్న, డీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement