ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నిరసన
నిర్మల్చైన్గేట్: ఇంటర్, డిగ్రీ, వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకా యిలు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ ఆ ధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తె లిపారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల కాక పేద విద్యార్థులు ఇబ్బందులు ప డుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే బకా యిలు విడుదల చేసి విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. నాయకులు వుజారం మహేశ్, సుద్దాల మహిపాల్, చుక్క ల నరేశ్, ప్రణీత్, రఘు, అంజన్న, కృష్ణంరాజు, కల్యాణ్, రవి, సంజయ్, అజయ్ పాల్గొన్నారు.


