
కంద కాల తవ్వకం ఆపాలి
నిర్మల్చైన్గేట్: పేదలు సాగు చేసుకుంటున్న భూముల్లో కందకాల తవ్వకం ఆపాలని సీపీఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి కె.రాజన్న కోరారు. ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఆపి పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కె.రాజన్న మాట్లాడుతూ సారంగాపూర్ మండలం జౌలి గ్రామంలో 50 ఏళ్లుగా పేదలు సాగు చేసుకుంటున్న భూముల్లో ఫారెస్ట్ అధికారులు కందకాలు తవ్వి వారిని తరిమేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు ఆర్.రామలక్ష్మణ్, సాయినాథ్, సుదర్శన్, గంగాధర్ పాల్గొన్నారు.