
పరిహారం కోసం పోరుబాట
● పాత గ్రామాల్లో గుడిసెలు వేసి,
వంటవార్పు
కడెం: మండలంలోని రాంపూర్, మైసంపేట్ పునరావాస గ్రామస్తులు పరిహారం కోసం పోరుబాట పట్టారు. గ్రామాలను ఖాళీ చేసి ఏడాది గడిచినా పరిహారం అందలేదని సోమవారం రాంపూర్, మైసంపేట్ పాత గ్రామాల్లో గుడిసెలు వేసి, అక్కడే వంట వార్పు చేశారు. పునరావాస గ్రామాల్లో సాగు భూములను చదునుచేయించడం, పట్టాలు, విద్యుత్, సాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. లేదంటే పాత గ్రామల్లోనే వ్యవసాయం చేసుకుంటామన్నారు. ఉడుంపూర్ ఎఫ్ఆర్వో అనిత పునరావాస గ్రామస్తులతో మాట్లాడి డీఎఫ్వోకు పరిస్థితిని తెలియజేశారు.