కేంద్రం కుట్రలను ఐక్యంగా ఎదుర్కోవాలి | - | Sakshi
Sakshi News home page

కేంద్రం కుట్రలను ఐక్యంగా ఎదుర్కోవాలి

Jun 9 2025 12:56 AM | Updated on Jun 9 2025 12:56 AM

కేంద్రం కుట్రలను  ఐక్యంగా ఎదుర్కోవాలి

కేంద్రం కుట్రలను ఐక్యంగా ఎదుర్కోవాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: పోడు భూములను అటవీ భూములుగా మార్చే కేంద్ర ప్రభుత్వ కుట్రల ను ఐక్యంగా తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర క మిటీ సభ్యులు ఆడివయ్య, ఉడుత రవీందర్‌ పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కమిటీ సమావేశం ఆదివారం ఇంద్రనగర్‌లోని పార్టీ కార్యాలయంలో దుర్గం నూతన్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించగా వీరు హాజరై మాట్లాడారు. ఖానాపూర్‌ ప్రాంతాన్ని కొత్తగా టైగర్‌ జోన్‌గా ప్రకటించడం అన్యాయమని, ఈ ప్రకటనతో జిల్లా అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు. ఇటీవల పట్టాలున్న భూముల్లో నూ రైతులను సాగు చేసుకోనివ్వడంలేదని తెలిపారు. దీని వెనుక గిరిజనులు, గిరిజనేతరులను ఊళ్ల నుంచి తరిమివేసే కుట్ర ఉందని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గౌత మ్‌ కృష్ణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బొ మ్మెన సురేశ్‌, జిల్లా కమిటీ సభ్యులు తొడసం శంబు, ఫసియొద్దీన్‌, అవర్గ ముత్యం, నాగేల్లి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement