
అంతర్ని ఘటనపై విచారణ చేపట్టాలి
భైంసాటౌన్: కుభీర్ మండలంలోని అంతర్నిలో ప్రభుత్వ పాఠశాల భవనం కూ లిన ఘటనపై ప్రభుత్వం విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పీ రామారావు పటేల్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని ఏరియాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత చిన్నారులను పరామర్శించారు. వైద్యులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అంతర్ని ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. బాధ్యులైన డీఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ, ఉపాధ్యాయ సంఘాల నాయకులున్నారు.